Illegal affair: భర్తకు డేట్ ఫిక్స్ చేసిన భార్య, మ్యాటర్ సెటిల్ చేసిన ప్రియుడు, క్లైమాక్స్ లో రివర్స్ !
చెన్నై/ సేలం: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య, పిల్లలతో కలిసి సంతోషంగా జీవిస్తున్న భర్త మద్యం సేవించడానికి బానిస అయ్యాడు. ప్రతిరోజు సంపాధిస్తున్న డబ్బుల్లో సగం డబ్బు భర్త మద్యం సేవించడానికి తగలేస్తున్నాడు. మద్యం మత్తులో ఇంటికి వెలుతున్న భర్త దుప్పటి కప్పుకుని హ్యాపీగా నిద్రపోతున్నాడు. భర్త తీరుతో అతని భార్య విసిగిపోయింది. భర్త రోజూ మద్యం తాగి రాత్రి భోజనం చేసి నిద్రపోతే మరుసటి రోజు ఉదయం మాత్రమే నిద్రలేస్తున్నాడు. రాత్రిపూట భార్య ఆమె భర్తను తట్టితట్టి నిద్రలేపినా అతను కదలకుండా మెదలకుండా గురకపెట్టి నిద్రపోతున్నాడు.
ఇదే సమయంలో భార్య ఓ ప్రియుడని సెట్ చేసుకుని ఎంజాయ్ చేస్తోంది. ఓ రోజు తక్కువగా మద్యం సేవించిన భర్త అనుకోకుండా అర్దరాత్రి నిద్రలేచి అతని భార్య, ప్రియుడి రాసలీలల భాగోతం చూసి రగిలిపోయాడు. అంతే ఆవేశంతో ఊగిపోయి భార్యను పట్టుకుని చితకబాదేశాడు. సంక్రాంతి పండుగ సందర్బంగా బయట ముందే మద్యం సేవించిన భర్త ఇంటికి రెండు క్వాటర్లు మద్యం తీసుకెళ్లి పీకలదాక మ్యదం సేవించి భోజనం కూడా చెయ్యకుండా నిద్రపోయాడు. మరుసటి రోజు భర్త ప్రాణాలు పోయాయి, తన భర్త విపరీతంగా మద్యం సేవించి ఊపిరి ఆడకుండా చనిపోయి తనకు అన్యాయం చేసి వెళ్లిపోయాడని, చిన్న బిడ్డలతో తాను ఎలా జీవించాలని భార్య ఆర్తనాదాలు చేసింది.
పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిర్వహించారు. భర్త అంత్యక్రియలు జరిగిపోయాయి. భర్త దినాలు కూడా జరిగిపోయాయి. అయితే భర్త చనిపోయిన రోజు నుంచి తన మీద పోలీసులు నిఘా వేశారు అనే విషయం భార్య గుర్తించలేకపోయింది. పోలీసులు భార్యను, ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకుని బెండ్ తియ్యడంతో అతన్ని ఎలా చంపేశారో అనే విషయం పూసగుచ్చినట్లు పోలీసులకు చెప్పారు. భర్త చనిపోయాడని బయటకు కూడా ఏమాత్రం ఫీలింగ్ లేకుండా తిరిగేసిన భార్య అడ్డంగా బుక్కైపోయింది.

ఆరు సంవత్సరాల క్రితం పెళ్లి
తమిళనాడులోని సేలంలోని సాలెం అన్నదానపట్టిలోని కొత్తడి కాలనీలో జీవా (30) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఆరు సంవత్సరాల క్రితం జీవా కవిత (26) అనే యువతిని వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న జీవా, కవిత దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

రోజూ మద్యం సేవిస్తున్న భర్త
భార్య కవిత, ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తున్న జీవా రెండు సంవత్సరాల నుంచి మద్యం సేవించడానికి బానిస అయ్యాడు. ప్రతిరోజు సంపాధిస్తున్న డబ్బుల్లో జీవా సగం డబ్బు భర్త మద్యం సేవించడానికి తగలేస్తున్నాడు. మద్యం మత్తులో ఇంటికి వెలుతున్న జీవా దుప్పటి కప్పుకుని హ్యాపీగా నిద్రపోతున్నాడు.

గురకపెట్టి నిద్రపోయి మరుసటి రోజు నిద్రలేస్తున్న భర్త
భర్త జీవా తీరుతో అతని భార్య కవిత విసిగిపోయిందని సమాచారం. జీవా రోజూ మద్యం తాగి రాత్రి భోజనం చేసి నిద్రపోతే మరుసటి రోజు ఉదయం మాత్రమే నిద్రలేస్తున్నాడు. రాత్రిపూట కవిత ఆమె భర్త జీవాను తట్టితట్టి నిద్రలేపినా అతను కదలకుండా మెదలకుండా గురకపెట్టి నిద్రపోయి మరుసటి రోజు ఉదయం మాత్రమే నిద్రలేస్తున్నాడు.

ప్రియుడిని సెట్ చేసుకున్న భార్య
జీవా, కవిత దంపతులు నివాసం ఉంటున్న ఏరియాలోనే రాజు అనే యువకుడు నివాసం ఉంటున్నారు. భర్త జీవా తనకు పడక సుఖం ఇవ్వడం లేదని రగిలిపోయిన కవిత అదే ఏరియాలో ఉంటున్న రాజుతో చనువు పెంచుకుంది. భర్త జీవా ఇంట్లో లేని సమయంలో రాజును ఇంటికి పిలిపించుకుంటున్న కవిత అతనితో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చెయ్యడం మొదలు పెట్టింది.

అర్దరాత్రి భార్య, ప్రియుడిని చూసి రగిలిపోయిన భర్త
ఇదే సమయంలో జీవా భార్య కవిత ప్రియుడు రాజును సెట్ చేసుకుని రాత్రి పూట అతన్ని ఇంటికి పిలిపించుకుని ఎంజాయ్ చేస్తోంది. ఓ రోజు తక్కువగా మద్యం సేవించిన జీవా నిద్రపోయాడు. అర్దరాత్రి అనుకోకుండా నిద్రలేచిన జీవా అతని భార్య కవిత, ఆమె ప్రియుడు రాజు పక్కరూమ్ లోరాసలీలల సాగిస్తున్న భాగోతం చూసి రగిలిపోయాడు. అంతే ఆవేశంతో ఊగిపోయిన జీవా అతని భార్య కవిత, ప్రియుడు రాజును పట్టుకుని చితకబాదేశాడు.

సంక్రాంతి రోజు భర్తకు ఈ లోకంలో లాస్ట్ డే
ఇంకోసారి ఇలా చూస్తే ఇద్దరిని చంపేస్తానని జీవా అతని భార్య, కవిత, ప్రియుడు రాజుకు వార్నింగ్ ఇచ్చాడు. జనవరి 16వ తేదీన సంక్రాంతి పండుగ సందర్బంగా బయట ముందే మద్యం సేవించిన జీవా ఇంటికి రెండు క్వాటర్లు మద్యం తీసుకెళ్లి పీకలదాక మ్యదం సేవించి భోజనం కూడా చెయ్యకుండా నిద్రపోయాడు. పండుగ రోజు జీవా ఎంజాయ్ చేస్తున్నాడని అతని కుటుంబ సభ్యులు అనుకున్నారు.

నాటకాలు ఆడిన కిలాడీ భార్య
జనవరి 17వ తేదీన ఉదయం జీవా ప్రాణాలు పోయాయి, తన భర్త జీవా విపరీతంగా మద్యం సేవించి ఊపిరి ఆడకుండా చనిపోయి తనకు అన్యాయం చేసి వెళ్లిపోయాడని, చిన్న బిడ్డలతో తాను ఎలా జీవించాలని జీవా భార్య కవిత అందరి ముందు ఆర్తనాదాలు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి జీవా శవానికి పోస్టుమార్టం నిర్వహించారు. మరుసటి రోజు జీవా అంత్యక్రియలు జరిగిపోయాయి. 11 రోజుల తరువాత జీవా పెద్ద ఖర్మ, దినాలు కూడా జరిగిపోయాయి.

పోలీసులు నిఘా వేశారని గుర్తించలేకపోయింది
పోస్టుమార్టం నివేదికలో జీవాను గొంతు నుమిలి ఊపిరిరాకుండా చేసి చంపేశారని, అతన్ని హత్య చేశారని వెలుగు చూసింది. భర్త జీవా చనిపోయిన రోజు నుంచి తన మీద పోలీసులు నిఘా వేశారు అనే విషయం అతని భార్య కవిత గుర్తించలేకపోయింది. రోజూ ప్రియుడు రాజుకు ఫోన్లు, వీడియె కాల్స్ చేస్తున్న కవిత అతనితో గంటలు గంటలు మాట్లాడుతూ ఎంజాయ్ చేసింది.

భర్త చనిపోతే భార్య ఆమె ప్రియుడితో ఫోన్ లో ?
పోలీసులు కవిత మొబైల్ ఫోన్ ను ట్రేస్ చేశారు. కవిత రాజు అనే వ్యక్తితో రోజు కొన్ని గంటల పాటు వీడియె కాల్స్ చేస్తూ బూతు మాటలు మాట్లాడుతోందని పోలీసులు గుర్తించారు. పోలీసులు జీవా భార్య కవితను, ఆమె ప్రియుడు రాజును అదుపులోకి తీసుకుని బెండ్ తిశారు. తన ప్రియుడు రాజుతో కలిసి తన భర్త జీవాను ఎలా చంపేశారో అనే విషయం పూసగుచ్చినట్లు కవితా పోలీసులకు చెప్పింది. కవిత, ఆమె ప్రియుడు రాజును పోలీసులు అరెస్టు చేశారు.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications