Weather: ఏపీ, తెలంగాణలో మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్
న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కొనసాగుతున్నాయి.నైరుతి రుతుపవనాల ప్రభావంతో వచ్చే మూడు రోజుల పాటు హైదరాబాద్తో సహా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది.
తెలుగు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్
ఉత్తర ఒడిశా, దాని పరిసర ప్రాంతాల మీదుగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నాయి, దిగువ ట్రోపోపాజ్లో యానాం కొనసాగుతోంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉరుములతో కూడిన తుఫాను హెచ్చరికల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
గురు, శుక్రవారాల్లో ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ శాఖ (అమరావతి) అంచనా వేసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం గురు, శుక్రవారాల్లో దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గుంటూరు, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో కొమరం భీమ్ ఆసిఫాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, జనగామ, సిద్దిపేట, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.