పెరిగిన జన్ ధన్ ఖాతాలు.. 90వేల కోట్ల డిపాజిట్లు..!
ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జన్ ధన్ యోజనకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. 2014 ఆగస్టు 28న ప్రారంభించిన ఈ కార్యక్రమం ఆశించిన ఫలితాలు ఇస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా శ్రీకారం చుట్టిన జన్ధన్ యోజన.. నాలుగున్నరేళ్లలో మంచి మార్కులు కొట్టేసింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం జనవరి 30వ తేదీ నాటికి.. జన్ ధన్ యోజన ఖాతాల్లో ప్రజలు డిపాజిట్ చేసిన మొత్తం 89 వేల 257 వందల 57 కోట్ల రూపాయలుగా ఉంది. ఇది త్వరలోనే 90 వేల కోట్ల రూపాయలు దాటనుండటం విశేషం.
మొదట్లో జన్ ధన్ యోజన కింద ఖాతాలు తీసుకున్నవారికి లక్ష రూపాయల ప్రమాద బీమా కల్పించింది కేంద్ర ప్రభుత్వం. గతేడాది ఆగస్టు 28 తర్వాత ఆ మొత్తం 2 లక్షల రూపాయలకు పెంచింది. ఓవర్ డ్రాఫ్ట్ మొత్తాన్ని 10 వేల రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఖాతాలు తీసుకునేవారి సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది.

జన్ ధన్ యోజన ప్రారంభించిన మొదట్లో ఒక్క ఇంటికి ఒక్క ఖాతా మాత్రమే తెరిచే వీలుండేది. అనంతరం ప్రతి వ్యక్తికి ఓ ఖాతా అన్నట్లుగా రూల్స్ సవరించారు. ఇది కూడా ఖాతాల సంఖ్య పెరగడానికి కారణంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు 30 కోట్లకు పైగా ఖాతాలు తెరిచినట్లు సమాచారం. 2014 ఆగస్టు 28న జన్ ధన్ యోజన ప్రారంభించినప్పటికీ.. 2017, మార్చి నుంచి ఖాతాల్లోకి జమ చేసే మొత్తం పెరుగుతూ వచ్చింది.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications