స్పూత్నిక్-వీకు భారత్ ఆమోదం.. ఇప్పటికే అందుబాటులో రెండు టీకాలు...
భారత్లో కరోనా కేసుల తీవ్రత పెరుగుతోంది. రోజురోజుకీ కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నా.. డోసుల కొరత ఎదుర్కోవాల్సి వస్తోంది. కరోనా కేసులు వేగంగా పెరిగిపోతుండటంతో అదే స్థాయిలో వ్యాక్సినేషన్ కూడా పెరగాల్సిన అవసరం ఉంది. కరోనా వ్యాక్సినేషన్ కొరతను అధిగమించేందుకు వ్యాక్సిన్ ఉత్పత్తిని వేగవంతం చేస్తోంది ప్రభుత్వం.
ఇప్పటికే భారత్ లో రెండు కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి రాగా.. ఇప్పుడు మరో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేసింది. దేశంలో మరో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేసింది. రష్యా వ్యాక్సిన్ అయిన Sputnik-V టీకాకు భారత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. రష్యా వ్యాక్సిన్కు డీసీజీఐ ఆమోదం తెలిపింది. దీంతో దేశంలో అందుబాటులోకి వచ్చింది. కరోనా వేవ్ కొనసాగడంతో అందరికీ వ్యాక్సిన్ అందజేయనున్నారు.

Recommended Video
ఇప్పటివరకు 45 ఏళ్ల వారికి అనారోగ్యంగా ఉన్న (ఆరోగ్యంగా ఉన్న సరే) ఇచ్చేవారు. దానిని కేంద్ర ప్రభుత్వం 18 ఏళ్లు.. ఆ పై వారికి చేసింది. మే 1వ తేదీ నుంచి అందరికీ వ్యాక్సిన్ అందజేస్తారు. టీకా తీసుకోవడమే వైరస్ నిర్మూలనకు పరిష్కారం అని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు. ఆ మేరకు టీకా తీసుకునే వారి వయస్సును కుదించారు.












Click it and Unblock the Notifications