భారత్లో తగ్గిన జనాభా పెరుగుదల
ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం భారత్. ఈ విషయంలో మొదటి స్థానంలో ఉన్న చైనాను త్వరలోనే అధిగమిస్తుందన్న అంచనాలు ప్రభుత్వాలకు ముచ్చెమటలు పట్టించాయి. అయితే జనాభాను తగ్గించేందుకు దశాబ్దాలుగా చేస్తున్న ప్రచారానికి ఇప్పుడు ఫలితం దక్కింది. భారత్లో తొలిసారిగా జనాభా పెరుగుదల రేటు తగ్గింది.

ఐక్యరాజ్య సమితి నివేదిక
ప్రపంచ దేశాల్లో జనాభా పెరుగుదలకు సంబంధించి ఐక్యరాజ్య సమితి ఏటా అధ్యయనం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా పాపులేషన్ ఫండ్, స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ 2019 పేరుతో ఓ నివేదిక తీసుకొచ్చింది. అందులో భారత్లో జనాభా పెరుగుదల రేటు 0.4శాతం తగ్గినట్లు స్పష్టంచేసింది. ప్రస్తుతం దేశంలో 137కోట్ల జనాభా ఉండగా.. 2001-11 మధ్యకాలంలో పాపులేషన్ గ్రోత్ రేట్ 1.64శాతంగా నమోదైంది. అయితే 2010-19కి వచ్చేసరికి ఆ పర్సెంటేజీ 0.4శాతం మేర తగ్గింది.

కుటుంబ నియంత్రణ పద్దతులు
జనాభా పెరుగుదల తగ్గడానికి మహిళల్లో వచ్చిన చైతన్యమే కారణమని ఐక్యరాజ్యసమితి అభిప్రాయపడింది. చాలా మంది మహిళలు కుటుంబ నియంత్రణ పద్దతులు పాటిస్తున్నారని నివేదిక స్పష్టం చేసింది. అయితే బాల్య వివాహాలు మాత్రం ఏటా పెరగడంపై ఆందోళన వ్యక్తం చేసింది.

18ఏళ్లు దాటిన తర్వాతే తల్లులు
గతంలో 18ఏళ్లలోపు తల్లులు అవుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండేది. అయితే ఈ దశాబ్దంలో ఆ సంఖ్య సగానికి తగ్గిందని యూఎన్ రిపోర్ట్ స్పష్టం చేస్తోంది. తాజా నివేదిక ప్రకారం ఇకపై భారత్లో జనాభా పెరుగుదల సమస్య కాదని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. విద్యావంతులు, సామాజిక అవగాహన పెరగడం వల్లే ఇది సాధ్యమైందని అంటున్నారు.

సగటు టీఎఫ్ఆర్ 2.2
దశాబ్దకాలంలో భారత్లో జననాల రేటు చాలా వరకు తగ్గిందని యూఎన్ రిపోర్టు చెబుతోంది.1991లో వెయ్యికి 30 మంది తగ్గగా ప్రస్తుతం అది 20కి చేరింది. సంతాన సాఫల్య రేటు.. టీఎఫ్ఆర్ కూడా సగానికి తగ్గింది. 1970లో 5గా ఉన్న టీఎఫ్ఆర్ ప్రస్తుతం 2.2కు పరిమితమైంది. సగటు టీఎఫ్ఆర్ రేటు 2.1 కాగా.. 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అంతకన్నా తక్కువగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో సంతాన సాఫల్యత రేటు 1.8గా ఉండటం విశేషం. జీవన ప్రమాణాలు, అక్షరాస్యత పెరుగుతుండటం ఇందుకు కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఉత్తర, దక్షిణ భారత్లో అంతరం
దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల ఎక్కువగా ఉంది. ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా ఆ రాష్ట్రాల్లో పాపులేషన్ ఏ మాత్రం తగ్గడంలేదు. దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం జనాభా పెరుగుదల స్థిరంగా పెరుగుతోందని ఐక్యరాజ్య సమితి నివేదిక స్పష్టం చేస్తోంది. ఉత్తరాదిలో ముఖ్యంగా ఉత్తర్ ప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్లో జనాభా పెరుగుదల రేటు కలవరపెడుతోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆయా రాష్ట్రాల్లో టోటర్ ఫెర్టిలిటీ రేట్.. టీఎఫ్ఆర్ 3కు పైగాఉంది. నిరక్షరాస్యత, కుటుంబ నియంత్రణ విషయంలో మహిళలకు నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది.
-
సరిహద్దుల్లేని వ్యాపారానికి సుంకాల బేడీలు? భారత్ పట్టు.. అమెరికాకు తలనొప్పి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..!












Click it and Unblock the Notifications