గిన్నిస్ రికార్డు సాధించిన స్వచ్ఛ భారత్ ప్రకటన
రాయ్పూర్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ కార్యక్రమంపై యువతలో అవగాహన కల్పించేందుకు సిద్ధం చేసిన ప్రకటన.. ప్రపంచంలో అతిపెద్ద ప్రకటనగా రికార్డు సృష్టించింది. ప్రముఖ విద్యావేత్త జవహర్ సూరిశెట్టి సమన్వయంతో మధ్య భారత్లో ప్రముఖ సంస్థ అయిన సంతోష్ రంగ్టా గ్రూప్, భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) ఈ ప్రకటనను రూపొందించాయి.
భారత్కు స్వాతంత్య్రం వచ్చిన తరవాత పదవీ బాధ్యతలు చేపట్టిన ప్రధాన మంత్రులతో కూడిన ఈ ప్రకటన 36,180 చదరపు అడుగుల (180 అడుగుల వెడల్పు, 201 అడుగుల పొడవు) విస్తీర్ణంలో ఉందని గిన్నిస్ మంగళవారం ధ్రువీకరించింది.

ఈ సందర్భంగా జవహర్ సూరిశెట్టి మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి యువకుల్లో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని చెప్పారు. అందుకే భారత ప్రధానమంత్రులతో కూడిన ప్రపంచంలోనే అతిపెద్ద ప్రకటన(పోస్టర్)ను తయారు చేసి గిన్నిస్ రికార్డు సృష్టించామని తెలిపారు.
ఈ పోస్టర్ కంటే ముందు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ అభిమానుల క్లబ్ ఆధ్వర్యంలో 34,000ఫీట్లతో ‘బాస్' చిత్ర పోస్టర్ను యుకెలో విడుదలైంది. దానికంటే ముందు సోనీ మ్యూజిక్ 5000ఫీట్లతో మైకేల్ పేరిట మైకేల్ జాక్సన్ ఆల్బమ్ పోస్టర్ను 5000పీట్ల విస్తీర్ణంతో విడుదల చేసింది.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications