ఒడిశాలో హంగ్ అసెంబ్లీ ! బీజేడీ-బీజేపీకి సమాన సీట్లు ! ఇండియా టుడే యాక్సిస్ పోల్ !
పొరుగు రాష్ట్రమైన ఒడిశాలో తాజాగా లోక్ సభ ఎన్నికలతో పాటు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. ఇందులో అధికార బీజేడీతో విపక్ష బీజేపీ హోరాహోరా తలపడింది. కాంగ్రెస్ కు అవకాశమివ్వకుండా ఇన్నాళ్లూ రాజకీయాలు చేస్తున్న బీజేడీ, బీజేపీ ఈసారి మాత్రం సీట్ల పంపకాలు కొలిక్కిరాకపోవడంతో విడిగా పోటీ చేశాయి. అయితే ఈ హోరాహోరీ పోరులో లోక్ సభ ఫలితాలు ఏకపక్షంగా వస్తున్నాయని, అసెంబ్లీలో మాత్రం హంగ్ తప్పదని ఇండియా టుడే-మై యాక్సెస్ ఇండియా ఎగ్జిట్ పోల్ అంచనా వేస్తోంది.
ఒడిశాలో లోక్ సభ ఎన్నికల ఫలితాలపై ఇప్పటికే ఇండియా టుడే-మై యాక్సెస్ ఇండియా ఎగ్జిట్ పోల్ అంచనాలు వెల్లడించింది. ఇందులో ఒడిశాలో ఉన్న 21 లోక్ సభ సీట్లలో బీజేపీకి ఏకంగా 18-20 సీట్లు దక్కుతాయని యాక్సెస్ పోల్ అంచనా వేసింది. అధికార బీజేడీకి మాత్రం కేవలం 0-2 సీట్లు దక్కే అవకాశం ఉందని తెలిపింది. కాంగ్రెస్ కు 0-1 సీట్లు లభించే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. అనంతరం నిన్న అసెంబ్లీ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ కూడా బయటపెట్టింది.

ఒడిశా అసెంబ్లీలో మొత్తం 147 సీట్లు ఉండగా.. ఇందులో బీజేపీ, బీజేడీ ఇద్దరూ కూడా 62 నుంచి 80 సీట్ల మధ్య సాధించే అవకాశం ఉందని ఇండియా టుడే- మై యాక్సెస్ ఇండియా పోల్ అంచనా వేసింది. కాంగ్రెస్ పార్టీకి 5 నుంచి 8 సీట్లు లభించే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అధికారం చేపట్టేందుకు ఏ పార్టీకి అయినా కావాల్సిన మ్యాజిక్ మార్కు సీట్లు 74 కాగా.. ఈ ఫిగర్ సాధించడంలో ఏ పార్టీ సక్సెస్ అవుతుందన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. అలాగే కాంగ్రెస్ పార్టీ కింగ్ మేకర్ గా మారొచ్చనే అంచనాలున్నాయి.
యాక్సెస్ ఎగ్జిట్ పోల్ ప్రకారం, బీజేపీ ఓట్ల శాతం 42 శాతానికి పెరిగే అవకాశం ఉంది. బీజేడీ ఓట్ల శాతం కూడా 42కి పడిపోనుంది. మొత్తం పోలైన ఓట్లలో కాంగ్రెస్కు 12 శాతం ఓట్లు వస్తాయని యాక్సిస్ అంచనా వేస్తోంది. ఇతరులకు 4 శాతం ఓట్లు వస్తాయని అంచనా. ఈ ఎగ్జిట్ పోల్ నిజమైతే, 2004 తర్వాత రాష్ట్ర అసెంబ్లీలో బీజేడీకి పూర్తి మెజారిటీ రాకపోవడం ఇదే తొలిసారి అవుతుంది. ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నవీన్ పట్నాయక్ కు ఇబ్బందులు తప్పకపోవచ్చు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!












Click it and Unblock the Notifications