Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Mood of the Nation..ఏం చెబుతోంది: మోదీ మళ్లీ గద్దెనెక్కుతారా?

న్యూఢిల్లీ: ఈ ఏడాది అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరం.. అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటోన్నాయి. తెలంగాణలో భారత్ రాష్ట్ర సమితి అధికారంలో ఉంది. హ్యాట్రిక్ కొట్టడానికి సమాయాత్తమౌతోంది. మధ్యప్రదేశ్‌లో బీజేపీ, ఛత్తీస్‌గఢ్-రాజస్థాన్‌లల్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నాయి.

వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల కోసం ఈ అసెంబ్లీ వార్‌ను సెమీ ఫైనల్స్‌గా భావిస్తోన్నాయి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు. ఈ అయిదు రాష్ట్రాల్లో విజయకేతనాన్ని ఎగురవేయడం ద్వారా సార్వత్రిక ఎన్నికలపై ఆధిపత్యాన్ని కనపర్చాలనే పట్టుదలను ప్రదర్శిస్తోన్నాయి. దీనికి అనుగుణంగా వ్యూహాలను రూపొందించుకుంటోన్నాయి.

India Today-CVoter Mood of the Nation: 52 per cent of the people in favour of PM Modi

ఈ పరిస్థితుల మధ్య ఇండియా టుడే-సీఓటర్ నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్ వెల్లడైంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్న లోక్‌సభ స్థానాలకు ఇప్పటికప్పుడు ఎన్నికలను నిర్వహించాల్సి వస్తే.. పరిస్థితేమిటనేది ఈ పోల్ స్పష్టం చేసింది. ఎవరు రాజవుతారు? ఎవరు బంటు అవుతారనేది తేల్చి చెప్పింది.

కేంద్రంలో అధికారంలో ఎవరు వస్తారనేది కుండబద్దలు కొట్టింది. జాతీయ, ప్రాంతీయ పార్టీల్లో అత్యధిక లోక్‌సభ స్థానాలు ఎవరి ఖాతాలో పడతాయనేది వెల్లడించింది. రాష్ట్రాలు, పార్టీల వారీగా మెజారిటీ లోక్‌సభ స్థానాల్లో ఎవరి జెండా ఎగురుతుందనేది తేల్చేసింది. తాజా రాజకీయాలనూ విశ్లేషించింది.

ప్రధానమంత్రిగా మళ్లీ నరేంద్ర మోదీని మెజారిటీ ప్రజలు కోరుకుంటోన్నారనది ఈ సర్వే తేల్చి చెప్పింది. మరో ఏడెనిమిది నెలల్లో సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న ఈ పరిస్థితుల్లోనూ ఆయనకు ఆదరణ తగ్గలేదని స్పష్టం చేసింది. సర్వేలో పాల్గొన్న వారిలో 52 శాతం మంది మూడోసారి ప్రధానిగా మోదీ అధికారంలోకి రావాలని కోరుకుంటోన్నట్లు తెలిపింది.

India Today-CVoter Mood of the Nation: 52 per cent of the people in favour of PM Modi

ప్రస్తుత నెలలో నిర్వహించిన సర్వే ఇది. 63 శాతం మంది ప్రధానిగా మోదీ పనితీరుపై సంతృప్తిని వ్యక్తం చేసినట్లు వెల్లడైంది. గతంలో నిర్వహించిన సర్వేతో పోల్చితే ఈ సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. అప్పట్లో 72 శాతం మంది మోదీ పనితీరు పట్ల సంతృప్తిని వ్యక్తం చేయగా.. ఇప్పుడా సంఖ్య 63కు పడిపోయింది.

2024 ఎన్నికల్లో మోదీని చూసే బీజేపీకి ఓటు వేస్తామని 44 శాతం మంది అభిప్రాయపడినట్లు మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్ వెల్లడించింది. బీజేపీకి ఓటు వేయడానికి గల కారణాలు- అభివృద్ధి, హిందుత్వ కారణాలేనని తేల్చి చెప్పింది ఇండియా టుడే-సీఓటర్ సర్వే. 13 శాతం మంది మోదీ పనితీరుకు యావరేజ్ మార్కులు వేశారు. మరో 22 శాతం మంది ఆయన పనితీరు పేలవంగా ఉందని తేల్చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+