భారత సైన్యం చేతికి 'షేర్' మెషిన్ గన్.. నిమిషానికి 700 బుల్లెట్లు..
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అస్థిరత నెలకొంది. రష్యా- ఉక్రెయిన్, ఇజ్రాయెల్- ఇరాన్, ఇజ్రాయెల్- గాజా, యెమెన్- సిరియా, చైనా- తైవాన్, పాకిస్థాన్- బలూచిస్థాన్.. ఇలా సరిహద్దు దేశాలు నువ్వా నేనా అన్నట్లు దాడులు చేసుకుంటున్నాయి. ఇక భారత్ కు పాకిస్థాన్, చైనాలతో ముప్పు పొంచి ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ తన ఆయుధ సంపత్తిని మరింత పెంచుకుంటోంది. ఈ క్రమంలో భారత అమ్ముల పొదిలోకి మరో శక్తివంతమైన ఆయుధం చేరనుంది.
భారత సైన్యం చేతికి త్వరలో అత్యంత శక్తివంతమైన ఏకే-203 రైఫిల్స్ చేరనున్నాయి. ఈ మేరకు తొలి బ్యాచ్ ఆయుధాలను భారత్ కు ఇచ్చేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఇండో- రష్యన్ రైఫిల్స్ లిమిటెడ్ సంయుక్తంగా అమేథీలో వీటి నిర్మాణం చేపట్టాయి. ఈ మేరకు భారత్- రష్యా మధ్య రూ. 5,200 కోట్ల ఒప్పందాలు జరిగాయి. డీల్ లో భాగంగా ఇప్పటికే 48 వేల ఏకే- 203 రైఫిల్స్ ను సిద్ధం చేసినట్లు సమాచారం.
గతంలో పేరొందిన కళాష్నికోవ్ సిరీస్ ను మరింతగా అప్డేట్ చేసి వీటిని తయారు చేశారు. ఈ రైఫిల్స్ నిమిషానికి 700 రౌండ్ల బుల్లెట్స్ తో దాడి చేయగలవు. వీటి రేంజ్ 800 మీటర్ల వరకు ఉంటుంది. ఈ రైఫిల్ కు షేర్ అని నామకరణం చేశారు. ది ఇండో- రష్యా రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సంయుక్తంగా ఈ రైఫిల్స్ ను ఉత్తర్ ప్రదేశ్ లోని అమేథీలో తయారు చేస్తోంది.
ఈ మేరకు ఇరు సంస్థల మధ్య రూ.5,200 కోట్ల ఒప్పందం జరిగినట్లు మేజర్ జనరల్ ఎస్ కే శర్మ పేర్కొన్నారు. డిసెంబర్ 2030 నాటికి 6 లక్షలకు పైగా ఏకే- 203 రైఫిల్స్ అందించేందుకు ఒప్పందం జరిగినట్లు తెలిపారు. ఇప్పటికే దాదాపు 48 వేల రైఫిళ్లను ఇచ్చేశామని, మరో మూడు వారాల్లోగా మరో 7 వేల రైఫిళ్లు అందజేస్తామని, డిసెంబరు నాటికి 15 వేల రైఫిళ్లు అదనంగా అందజేయడానికి సిద్దంగా ఉన్నామని శర్మ తెలిపారు.

ఇక ఈ ఏకే- 203 రైఫిల్స్ బరువు 3.8 కేజీలు ఉంటుంది. ప్రస్తుతం భారత్ వద్ద ఉన్న ఏకే-47, ఏకే-57 రైఫిల్స్ బరువు 4.15 కేజీలు ఉంటుంది. అంటే వాటితో పోల్చితే బరువు తక్కువే. కాగా పొడవు కూడా తక్కువగానే 705 ఎంఎం మాత్రమే ఉంది. ఈ రైఫిల్స్ ను పాకిస్థాన్, చైనా దేశాల సరిహద్దు, నియంత్రణ రేఖ, వాస్తవాధీన రేఖ వెంట గస్తీ నిర్వహిస్తున్న సైనికుల చేతికి అందించాలని కేంద్ర రక్షణ మంత్రత్వ శాఖ భావిస్తోంది.
#FPExplained: The Indian Army is set to receive a new batch of AK-203 assault rifles, which are manufactured in Amethi. What are they?https://t.co/9i46LAuQoH
— Firstpost (@firstpost) July 18, 2025
ఇటీవలే భారత నేవీ రంగాన్ని మరింత పటిష్టం చేసేందుకు మోస్ట్ అడ్వాన్స్ డ్ స్టీల్త్ ఫ్రిగేట్ రంగానికి చెందిన INS తమాల్ యుద్ధ నౌక సేవలను ప్రారంభించింది. అమెరికా నుంచి మూడు అపాచీ హెలికాప్టర్లు ఈ నెలాఖరులోగా వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అమెరికా- భారత్ మధ్య 2020లో 600 మిలియన్ల డాలర్లతో ఈ ఒప్పందం కుదిరింది. ఈ డీల్ ప్రకారం భారత్ కు అమెరికా 6 అపాచీ హెలికాప్టర్లు అందించాల్సి ఉంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications