Indian Railway: జులై 1 నుంచి అమల్లోకి రైల్వే కొత్త ఛార్జీలు
Indian Railway: రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక. భారతీయ రైల్వే జులై 1,2025 నుంచి కొత్త ఛార్జీల టారిఫ్ను అమలు చేయబోతోంది. ఈ మార్పు సాధారణ ప్రయాణికులతో పాటు సుదూర ప్రయాణం చేసే ప్రయాణికుల జేబులకు చిల్లు పెడుతుంది. అయితే కొన్నికేటగిరీలలో ఎటువంటి పెరుగుదల లేకపోవడం ఉపశమనం కలిగించే విషయం.
రైల్వే కొత్త టారిఫ్ ప్రకారం.. సాధారణ రెండో తరగతి(సెకండ్ క్లాస్)లో 500 కిలోమీటర్ల వరకు ప్రయాణానికి ఎటువంటి పెరుగుదల ఉండదు. కానీ ప్రయాణం 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉంటే ప్రతి కిలోమీటరకు అర పైసా అదనంగా చెల్లించాలి. ఇది కాకుండా మెయిల్/ఎక్స్ప్రెస్ రైళ్లలో(నాన్-ఏసీ) ప్రయాణించేవారు ఇప్పుడు ప్రతి కిలోమీటరుకు ఒక పైసా అదనంగా చెల్లించాలి. అదే విధంగా ఏసీ క్లాస్ టికెట్లో కూడా మార్పు చేయబడుతుంది. ఇందులో ప్రతి కిలోమీటరుకు 2 పైసల పెరుగుదల ఉంది.

సబర్బన్, నెలవారీ టికెట్లలో మార్పు లేదు..
పట్టణ(సబర్బన్) రైళ్ల ఛార్జీలలో ఎటువంటి మార్పు చేయబడలేదు. ఇది లక్షలాది మంది రోజువారీ ప్రయాణికులకు ఉపశమనం కలిగిస్తుంది. నెలవారీ సీజన్ టికెట్ ధరలలో కూడా ఎటువంటి పెరుగుదల లేదు.
టికెట్ బుకింగ్ నిబంధనలలో మార్పు
నివేదికల ప్రకారం, దీనికి ముందు రైల్వే టికెట్ బుకింగ్ నియమాలలో మార్పు చేయాలని నిర్ణయించింది. ఇప్పటివరకు మీరు రైలు టికెట్ బుక్ చేస్తే, మీ ప్రయాణానికి నాలుగు గంటల ముందు మాత్రమే టికెట్ కన్ఫర్మ్ అయిందా లేదా అనేది తెలుసుకోవచ్చు. కానీ ఇప్పుడు రైల్వే కొత్త సిస్టమ్పై పని చేస్తోంది. రైల్వే ప్రకారం, కన్ఫర్మ్ సీట్లు ఉన్న చార్ట్ ప్రయాణానికి 24 గంటల ముందు విడుదల చేయబడుతుంది. టికెట్ బుకింగ్ కొత్త సిస్టమ్ కోసం రైల్వే సన్నాహాలు ప్రారంభించింది. దీనికి సంబంధించిన ట్రయల్ కూడా ప్రారంభమైంది. జూన్ 6 నుంచి ఈ సిస్టమ్ రాజస్థాన్లోని బికనీర్ డివిజన్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించబడింది. ఇది ప్రస్తుతం ఒక రైలుకు మాత్రమే పరిమితం చేయబడింది. ఇప్పటివరకు ఎటువంటి సమస్యలు రాలేదు. రైల్వే అధికారులు కొన్ని వారాల పాటు దీనిని పరీక్షిస్తారని అంటున్నారు.












Click it and Unblock the Notifications