విమానంలో ప్రయాణికురాలికి మురికి సీటు.. ఇండిగో సంస్థకు భారీ జరిమానా
సాధారణంగా విమానప్రయాణం అంటేనే లగ్జరీతో కూడుకున్న విషయం. ఇతర ప్రయాణ మార్గాల కంటే విమాన ప్రయాణానికే అధిక ఖర్చు ఉంటుంది. అందుకు తగ్గట్లు వైమానిక సంస్థలు ప్రయాణికుల భద్రత కోసం పలు జాగ్రత్తలు తీసుకుంటాయి. అయితే ఇండిగో విమానంలో ప్రయాణికురాలికి మురికి సీటును కేటాయించింది ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థ. దీంతో ఆమె ఫిర్యాదు మేరకు వినియోగదారుల ఫోరం సంస్థకు రూ.1.5 లక్షల జరిమానా విధించింది. ప్రయాణికురాలికి డర్టీ సీటు కేటాయించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
IndiGo Fined Rs 1.5 Lakh For Providing "Unhygienic, Dirty" Seat To Passenger https://t.co/14ZecPYH5r pic.twitter.com/A2UUM840vd
— NDTV (@ndtv) August 10, 2025
ఇండిగో విమానంలో ఇటీవల జరిగిన ఓ షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ ప్రయాణికురాలికి పరిశుభ్రంగా లేని, అసౌకర్యవంతమైన సీటును కేటాయించారు. దీంతో ఆమె దిల్లీలోని వినియోగదారుల ఫోరంకు ఫిర్యాదు చేశారు. అయితే విచారణ జరిపిన వినియోగ దారుల ఫోరం సంస్థ.. ఇలా చేసినందుకు ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థకు రూ.1.5 లక్షల జరిమానా విధించింది. ఈ మొత్తంలో రూ.1 లక్షను ప్రయాణికురాలికి పరిహారంగా.. మిగిలిన రూ.50 వేలను న్యాయ పోరాట ఖర్చులకు చెల్లించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.
ఈ ఏడాది జనవరి 5 వ తేదీన పింకీ అనే మహిళ బాకు నుంచి దిల్లీకి ఇండిగో విమానంలో ప్రయాణించింది. అయితే ఆమెకు అపరిశుభ్రంగా, మరకలతో ఉన్న డర్టీ సీటును ఇచ్చారు. అది అసౌకర్యకంగా కూడా ఉండటం గమనార్హం. ఆమె దిల్లీ వచ్చేవరకు అందులోనే కూర్చున్నారు. ఆ తర్వాత దిల్లీలోని వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశారు. ఆ సీట్లో కూర్చోవడం వల్ల తాను ఇబ్బందులు పడ్డానని తెలిపారు. అయితే విచారణ జరిపిన వినియోగ దారుల ఫోరం సంస్థ.. ఇలా చేసినందుకు ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థకు రూ.1.5 లక్షల జరిమానా విధించింది. ఈ మొత్తంలో రూ.1 లక్షను ప్రయాణికురాలికి పరిహారంగా ప్రకటించింది. మిగిలిన రూ.50 వేలను న్యాయ పోరాట ఖర్చులకు చెల్లించాల్సిందిగా ఆదేశించింది.

ఇక ఇటీవలి కాలంలో దేశంలో విమాన ప్రమాదాలు, సాంకేతిక సమస్యలు అధికంగా జరుగుతున్నాయి. ఇటీవల గుజరాత్ అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనలో 265 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే ఉత్తరాఖండ్ లో ఓ విమానం కూలి ఏడుగురు భక్తులు మరణించారు. అలాగే అనేక విమానాలు సాంకేతిక లోపం కారణంగా ఎక్కడపడితే అక్కడ ల్యాండింగ్ అవడం జరిగాయి. అలాగే మరికొన్ని ఆలస్యంగా ప్రయాణించాయి.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications