Infosys: నారాయణమూర్తి ఐడియానే పట్టించుకోని ఉద్యోగులు ! ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం..!
భారత్ లో అత్యధిక వేతనాలు అందుకుంటున్న ఐటీ ఉద్యోగులపై ఒత్తిడి కూడా ఆ స్ధాయిలోనే ఉంటోంది. దీంతో వారానికి 70 పని గంటలకు పరిమితం చేయాలన్న డిమాండ్లు కూడా వినిపిస్తూనే ఉన్నాయి. గతంలో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి వారానికి 70 పని గంటలు మాత్రమే ఉండాలన్న డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. రోజుకు 9.15 గంటల చొప్పున వారానికి 70 గంటలు మాత్రమే పని చేయాలనేది ఆయన ఆలోచన. అయితే ఈ ఆలోచనను ఆయన సొంత కంపెనీ ఇన్ఫోసిస్ ఉద్యోగులే అమలు చేయడం లేదట.
దీంతో ఇన్ఫోసిస్ ఉద్యోగులు ఇకపై పని గంటలు దాటినా ఎక్కువ సమయం డ్యూటీలో ఉంటే వార్నింగ్ ఈ మెయిల్స్ పంపాలని మానవ వనరుల విభాగం (హెచ్ఆర్) నిర్ణయించింది. ఈ మేరకు ఉద్యోగులందరికీ ఓ ఈ మెయిల్ పంపింది. వారానికి 70 పని గంటలు మాత్రమే ఉండాలని, వారాంతంలో రెండు రోజులు సెలవులు ఇవ్వాలన్న నారాయణ మూర్తి ఆలోచన ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. నారాయణమూర్తి ఆలోచనకు భిన్నంగా ఎక్కువ గంటలు పనిచేస్తున్న ఉద్యోగులకు ఆటోమేటిగ్గా రోజుకు 9.15 గంటలు దాటితే వార్నింగ్ మెయిల్ పంపేలా ఓ వ్యవస్ధను ఏర్పాటు చేశారు.

వాస్తవానికి ఇన్ఫోసిస్ క్యాంపస్ లలో కాకుండా ఇంటి వద్ద నుంచే రిమోట్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులు ఇలా నిర్ణీత సమయం 9.15 గంటల కంటే ఎక్కువగా పనిచేస్తున్నట్లు హెచ్ఆర్ వర్గాలు గుర్తించాయి. వీరికి నెలవారీ పని గంటల లెక్క ఉంటుంది. కాబట్టి ఈ లక్ష్యాల్ని అందుకునేందుకు ఇలా కొన్ని రోజులు ఎక్కువ గంటలు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. దీని వల్ల వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్ వారికి ఇలా వార్నింగ్ మెయిల్స్ పంపి అలర్ట్ చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం ప్రభావం 3.23 లక్షల మంది ఉద్యోగులపై ఉంటుందని అంచనా.
పని పట్ల మీ నిబద్ధతను ప్రశంసిస్తున్నామని, అయితే వృత్తి జీవితానికీ, వ్యక్తిగత జీవితానికీ మధ్య ఉండాల్సిన సమతుల్యం దెబ్బతినకుండా ఉంటే దీర్ఘకాలికంగా పనిచేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లు హెచ్ఆర్ ఉద్యోగులకు పంపుతున్న మెయిల్స్ లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. భారతీయ ఐటీ రంగంలో ఉద్యోగుల ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో ఇన్ఫోసిస్ తీసుకున్న నిర్ణయం కరెక్టేనన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications