యాడ దొరికిన సంతరా ఇది- డస్ట్ బిన్లతో కొట్టుకున్న వందే భారత్ సిబ్బంది
ఢిల్లీలోని నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. గ్వాలియర్ వెళ్లే నంబర్ 22470 వందే భారత్ ఎక్స్ప్రెస్ సిబ్బంది మధ్య జరిగిన ఘర్షణ ప్రయాణికులను షాక్ కు గురిచేసింది. రైలు బయలుదేరడానికి కొద్దిసేపటి ముందు జరిగిన ఈ సంఘటనపై రైల్వే అధికారులు విచారణ ప్రారంభించారు. ఈ గొడవ రైల్వే ప్రతిష్ట, వందే భారత్ ప్రీమియం సేవలకు చెడ్డ పేరు తెచ్చినట్టయిందని ఆందోళన వ్యక్తం చేశారు.
సోషల్ మీడియాలో ఈ గొడవకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. 1:19 నిమిషాల నిడివి గల వీడియో ఇది. సిబ్బంది డస్ట్బిన్లు, బెల్టులు, పిడికిళ్లతో కొట్టుకుంటున్న దృశ్యాలు అందులో రికార్డ్ అయ్యాయి. దీనిపై నెటిజన్లు ఘాటుగా స్పందిస్తోన్నారు. ఇలాంటి ప్రవర్తన గల ఉద్యోగులు రైల్వేలో ఉద్యోగం చేయడానికి అనర్హులు అని చెబుతున్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోన్నారు. వారిని విధుల నుంచి అప్పటికప్పుడే బర్తరఫ్ చేయాలని సలహా ఇస్తోన్నారు.

నిజాముద్దీన్ రైల్వే స్టేషన్న ప్లాట్ ఫామ్ పై ఒకవంక వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు నిల్చుని ఉండగా.. మరోవంక ఎనిమిది మంది సిబ్బంది గొడవపడటం ఈ వీడియోల్లో స్పష్టంగా చూడొచ్చు. బెల్టులతో కొట్టుకున్నారు. బూతులు తిట్టుకున్నారు. డస్ట్బిన్లను సైతం విసురుకోవడం కనిపించింది. కిందపడ్డా వెనక్కి తగ్గలేదు. మళ్లీ మళ్లీ పైకి లేస్తూ గొడవ పడ్డారు. దీన్నంతటినీ ప్రయాణికులు దూరంగా ఉండి చూశారు. మరికొందరు తమ సెల్ ఫోన్ లో దీన్ని వీడియో తీశారు.
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ జోక్యం చేసుకున్నప్పటికీ వందే భారత్ ఎక్స్ ప్రెస్ సిబ్బంది వినేదు. వారి ముందే కొట్టుకున్నారు. తోసుకున్నారు. ఇది సోషల్ మీడియాలో పోస్ట్ అయిన కొద్దిసేపటికే వైరల్ గా మారింది. లక్షమందికి పైగా యూజర్లు దీన్ని వీక్షించారు. దానికి తగ్గట్టే రిప్లైలు కూడా పోస్ట్ అయ్యాయి. ఆ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తూ రిప్లైలు పెట్టారు.
IRCTC staffers serving onboard Vande Bharat settle an altercation with dustbin, belt and punches at Nizamuddin station in Delhi. pic.twitter.com/tldenRsRMz
— Piyush Rai (@Benarasiyaa) October 17, 2025
ఈ వీడియో వైరల్ అయిన వెంటనే రైల్వే అధికారులు రంగంలోకి దిగారు. విచారణ చేపట్టారు. షోకాజ్ నోటీసులు జారీ చేశారు. గొడవ పడ్డ వారిలో నలుగురిని ఆర్పీఎఫ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై IRCTC అధికారిక ప్రకటన విడుదల చేసింది. దీన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపింది. నలుగురు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నామని, వారి ఐడీ కార్డులను ఇనాక్టివ్ చేశామని, విధుల్లోంచి తొలగించినట్లు తెలిపింది. క్యాటరింగ్ సర్వీస్ ప్రొవైడర్ కు అయిదు లక్షల జరిమానా విధించినట్లు వివరించింది.
-
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా.. -
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్












Click it and Unblock the Notifications