Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తీహార్ జైలు నుంచి అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా పాలన సాధ్యమేనా? న్యాయ నిపుణులు చెప్తుందిదే!!

దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి పాలన సాగించడం సాధ్యమేనా? దేశ రాజధాని ఢిల్లీని పాలిస్తున్న అరవింద్ కేజ్రీవాల్ జైలు జీవితానికి సంబంధించి ప్రతి అనుమతి కోర్టు నుంచి తీసుకుంటున్న వేళ ఆయన ఢిల్లీని ఏ విధంగా జైలు నుంచి పాలిస్తారు? అన్న ప్రశ్నలు ప్రతి ఒక్కరిలోనూ ఉత్పన్నమవుతున్నాయి.

తీహార్ జైల్లో కేజ్రీవాల్ పరిస్థితి ఇలా
కేజ్రీవాల్ సీఎంగా కొనసాగటం, సాధ్యాసాధ్యాలపై న్యాయనిపుణులు ఏమంటున్నారు? చట్టం ఏం చెబుతుంది? ప్రస్తుతం తెలుసుకుందాం.ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ కు ఢిల్లీ లిక్కర్ కుంభకోణం మనీ ల్యాండరింగ్ కేసులో ఏప్రిల్ 15వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనను తీహార్ జైలుకు తరలించారు. తీహార్ జైల్లో అరవింద్ కేజ్రీవాల్ వస్తువుల దగ్గర నుండి, కలిసే మనుషుల వరకు ప్రతి ఒక్కటి కోర్టు అనుమతితోనే జరుగుతుంది.

arvind kejriwal chief minister rules delhi tihar jail legal experts opinion Practically impossible lalu prasad yadav case legal experts delhi excise policy arvind kejriwal news kavitha news mlc kavitha news lok sabha election 2024 loksabha election 2024 mlc 2024 2024

న్యాయ నిపుణులు చెప్తుంది ఇదే
ఇక ఇలాంటి సమయంలో అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలు కేంద్రంగా ఢిల్లీని పాలించడం సాధ్యమయ్యే విషయమేనా అంటే న్యాయ నిపుణులు ఆసక్తికర సమాధానాలు చెబుతున్నారు. అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలు కేంద్రంగా ఢిల్లీని పాలించడం ఆచరణ అసాధ్యమని పలువురు న్యాయనిపుణులు వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా కొనసాగటం కష్టమని చెబుతున్నారు. అయితే జైల్లో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని నడపకూడదు అన్నది ఏ రాజ్యాంగంలోనూ, చట్టంలోనూ లేదని, కాకుంటే ఇది ఆచరణ అసాధ్యమని వ్యాఖ్యానిస్తున్నారు.

లాలూ ప్రసాద్ యాదవ్ కేసును ఉదాహరిస్తున్న న్యాయవాదులు
అందుకు సహేతుకమైన కారణాలను కూడా చెబుతున్నారు. అరవింద్ కేజ్రీవాల్ జైలు కేంద్రంగా తాను చేసే ప్రతి చర్యకు కోర్టు నుంచి అనుమతి తీసుకోవలసి ఉంటుందని, జైలులో ఆయన ఎటువంటి క్యాబినెట్ సమావేశాలకు పిలవలేరని చెబుతున్నారు. గతంలో పశుగ్రాసం కుంభకోణంలో లాలు ప్రసాద్ యాదవ్ సీఎంగా ఉన్న సమయంలో జైల్లో ఉన్నప్పుడు కూడా ఆయన సీఎంగా జైలు నుండి ప్రభుత్వాన్ని నడపవచ్చు అని భావించారు కానీ అది ఆచరణ సాధ్యం కాలేదు.

అరెస్ట్ అయితే ముఖ్యమంత్రిగా కొనసాగకూడదని లేదు.. కానీ
దీంతో లాలూ ప్రసాద్ యాదవ్ రాజీనామా చేసి తన భార్య రబ్రీ దేవికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగించారని గుర్తు చేస్తున్నారు.ఒకసారి అరెస్ట్ అయిన తర్వాత ముఖ్యమంత్రిగా కొనసాగకూడదని చట్టంలో ఎటువంటి నిషేధం లేదని, కాకుంటే జైలు నుంచి పాలన సాగించడం ఆచరణ సాధ్యం కానిదని చెబుతున్నారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఒక ఎమ్మెల్యే దోషిగా నిర్ధారించిన తర్వాతనే మంత్రి పదవికి అనర్హుడిగా పరిగణించబడతాడని చెప్తున్నారు.

కేజ్రీవాల్ ఏం చెయ్యబోతున్నారు ?
కేజ్రీవాల్ దోషిగా నిర్ధారణ అయితేనే ఆయన ముఖ్యమంత్రి పదవికి అనర్హుడని చెబుతున్నారు. ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్ తరపున వాదిస్తున్న లాయర్లు మాత్రం జైలు నుంచి కేజ్రీవాల్ పరిపాలన చేయడం సాధ్యమనే వాదిస్తున్నారు. ఈ క్రమంలో తీహార్ జైలు నుంచి కేజ్రీవాల్ పాలన చేస్తారా? లేదా ప్లాన్ బీ అమలు చేస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+