ఇండియన్ ఎయిర్ఫోర్స్లో ఇజ్రాయిల్ బాంబులు...బాలాకోట్ దాడులకు వీటినే వాడారట..!
న్యూఢిల్లీ: ఇజ్రాయిల్ నుంచి స్పైస్-2000 బాంబులు ఇండియన్ ఎయిర్ఫోర్స్లో చేరాయి.దీంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైర్ పవర్ బలోపేతం అయ్యింది. బాలాకోట్లో దాడులు చేసేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వినియోగించింది ఈ స్పైస్ -2000 బాంబుెలు కావడం విశేషం. పుల్వామా దాడులకు ప్రతీకార చర్యలో భాగంగా భారత్ బాలాకోట్ దాడులు నిర్వహించింది. ఆ సమయంలో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థలకు చెందిన స్థావరాలపై భారత్ ఈ బాంబులను జారవిడిచింది.
ఈ ఏడాది జూన్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్పెస్ బాంబుల కోసం ఇజ్రాయిల్తో రూ. 300 కోట్లకు ఒప్పందం చేసుకుంది. మొత్తం 100 బాంబులను సప్లై చేయాల్సిందిగా డీల్ కుదుర్చుకుంది. ఈ బాంబులు ఒక్కసారి పై నుంచి జారవిడిస్తే ఒక భవంతి లోపలికి చొచ్చుకుపోయి ఆ తర్వాత భూమిని తాకి విస్ఫోటనం చెందుతాయని అధికారులు వెల్లడించారు.

బాలాకోట్లో ఈ స్పైస్ -2000 వర్షన్ బాంబులను ప్రయోగించి సక్సెస్ కావడంతో ఇండియన్ ఎయిర్ఫోర్స్ దీనికి మించిన అడ్వాన్స్ బాంబులు మార్క్ 84 కోసం ఇజ్రాయిల్కు ఆర్డర్ ఇచ్చింది. ఈ బాంబులు భవంతులను, బంకర్లను పూర్తిగా ధ్వంసం చేయగలే శక్తి ఉంటుంది. ఇక మార్క్ 84 వార్హెడ్లు మరో రెండు వారాల్లో భారత్కు చేరుకుంటాయని తెలుస్తోంది. ఇప్పటికే భారత్ పాక్ మధ్య యుద్ధవాతావరణం నెలకొనడంతో ఈ తరహా బాంబులు భారత రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుంది. అంతేకాదు త్వరలో యాంటీ రేడియేషన్ క్షిపణలు కూడా భారత రక్షణ వ్యవస్థలో చేరనున్నాయి.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!











Click it and Unblock the Notifications