ఉద్యోగాల తొలగింపుపై టెక్కీల ఆందోళన, పనితీరే ఆధారమంటున్న కాగ్నిజెంట్
9 మాసాల వేతనంతో ఉద్యోగులను వదిలించుకొంటున్న కాగ్నిజెంట్ సంస్థపై ఐటీ ఉద్యోగ సంఘాలు భగ్గుమన్నాయి. ఉద్యోగులను రోడ్డున పడేశారంటూ ఆందోళనకు దిగాయి.
చెన్నై: 9 మాసాల వేతనంతో ఉద్యోగులను వదిలించుకొంటున్న కాగ్నిజెంట్ సంస్థపై ఐటీ ఉద్యోగ సంఘాలు భగ్గుమన్నాయి. ఉద్యోగులను రోడ్డున పడేశారంటూ ఆందోళనకు దిగాయి. కొన్ని సంఘాలు తమిళనాడు లేబర్ డిపార్ట్ మెంట్ ను ఆశ్రయించాయి.
2.6 లక్షల మంది ఉద్యోగులున్న కాగ్నిజెంట్ సంస్థలో 5 శాతం మంది ఉద్యోగులను తొలగించడంపై ఐటీ సంఘాలు తీవ్రంగా అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఉద్యోగులను రోడ్డున పడేశారని ఆ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఫోరమ్ ఫర్ ఐటీ ఎంప్లాయిస్ , ఎన్డీఎల్ ఎప్ ఐటీ ఎంప్లాయిస్ లు ఈ మేరకు తమిళనాడు లేబర్ కార్యాలయంలో పిటిషన్లు దాఖలు చేశాయి. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల పనితీరు అసంతృప్తికరంగా ఉందనే కారణాలను చూపుతూ కాగ్నిజెంట్ సంస్థ ఉద్యోగులను తొలగించింది.
అయితే ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడాలని కోరుతున్నాయి ఐటీ ఉద్యోగసంఘాల నాయకులు. ఉద్యోగుల తొలగింపుపై కాగ్నిజెంట్ కూడ స్పందించింది. ప్రతి ఏటా ఉద్యోగుల పనితీరును సమీక్షిస్తుంటామంది. అందులో భాగంగానే లక్ష్యాలను చేరుకోలేని వారిని తొలగించి సంస్థలో మార్పులు తప్పనిసరన్నారు. అన్ని ఐటీ కంపెనీల్లో ఇది సర్వసాధారణమేనని చెప్పారు.
-
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
CSK vs RCB: కొంపముంచిన నోబాల్.. చెన్నైని చిత్తు చేసిన ఆర్సీబీ! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!!












Click it and Unblock the Notifications