ఉద్యోగాల తొలగింపుపై టెక్కీల ఆందోళన, పనితీరే ఆధారమంటున్న కాగ్నిజెంట్
9 మాసాల వేతనంతో ఉద్యోగులను వదిలించుకొంటున్న కాగ్నిజెంట్ సంస్థపై ఐటీ ఉద్యోగ సంఘాలు భగ్గుమన్నాయి. ఉద్యోగులను రోడ్డున పడేశారంటూ ఆందోళనకు దిగాయి.
చెన్నై: 9 మాసాల వేతనంతో ఉద్యోగులను వదిలించుకొంటున్న కాగ్నిజెంట్ సంస్థపై ఐటీ ఉద్యోగ సంఘాలు భగ్గుమన్నాయి. ఉద్యోగులను రోడ్డున పడేశారంటూ ఆందోళనకు దిగాయి. కొన్ని సంఘాలు తమిళనాడు లేబర్ డిపార్ట్ మెంట్ ను ఆశ్రయించాయి.
2.6 లక్షల మంది ఉద్యోగులున్న కాగ్నిజెంట్ సంస్థలో 5 శాతం మంది ఉద్యోగులను తొలగించడంపై ఐటీ సంఘాలు తీవ్రంగా అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఉద్యోగులను రోడ్డున పడేశారని ఆ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఫోరమ్ ఫర్ ఐటీ ఎంప్లాయిస్ , ఎన్డీఎల్ ఎప్ ఐటీ ఎంప్లాయిస్ లు ఈ మేరకు తమిళనాడు లేబర్ కార్యాలయంలో పిటిషన్లు దాఖలు చేశాయి. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల పనితీరు అసంతృప్తికరంగా ఉందనే కారణాలను చూపుతూ కాగ్నిజెంట్ సంస్థ ఉద్యోగులను తొలగించింది.
అయితే ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడాలని కోరుతున్నాయి ఐటీ ఉద్యోగసంఘాల నాయకులు. ఉద్యోగుల తొలగింపుపై కాగ్నిజెంట్ కూడ స్పందించింది. ప్రతి ఏటా ఉద్యోగుల పనితీరును సమీక్షిస్తుంటామంది. అందులో భాగంగానే లక్ష్యాలను చేరుకోలేని వారిని తొలగించి సంస్థలో మార్పులు తప్పనిసరన్నారు. అన్ని ఐటీ కంపెనీల్లో ఇది సర్వసాధారణమేనని చెప్పారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications