గవర్నర్కు లేఖ: పిడిపికి మద్దతిస్తామని ఒమర్ అబ్దుల్లా
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై నేషనల్ కాన్ఫరెన్స్ నేత, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ముందుకు వచ్చారు. ప్రభుత్వ ఏర్పాటుకు తాము పిడిపికి మద్దతు ఇస్తామని ఆయన చెప్పారు. ఈ మేరకు ఆయన మంగళవారంనాడు గవర్నర్ ఎన్ఎన్ వోహ్రాకు లేఖ రాశారు.
రాష్ట్రంలో 28 శాసనసభా స్థానాలకు గెలుచుకుని ఏకైక పెద్ద పార్టీగా అవతరించిన పిడిపికి మద్దతు ఇస్తామని ఒమర్ అబ్దుల్లా చెప్పారు. నేషనల్ కాన్ఫరెన్స్ కోర్ గ్రూప్ సోమవారంనాడు సమావేశమైంది. ప్రభుత్వ ఏర్పాటుకు బిజెపికి మద్దతు ఇవ్వకూడదని నిర్ణయించుకుంది. ప్రాంతీయ పార్టీ అయిన పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీకి (పిడిపికి) మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఇప్పటి వరకు ఏ పార్టీ గానీ కూటమి గానీ ముందుకు రాలేదు. జనవరి 9వ తేదీన రాష్ట్రంలో గవర్నర్ పాలన విధించారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పదవి నుంచి తనను తప్పించాలని ఒమర్ అబ్దుల్లా కోరారు.
ఇటీవల జరిగిన శానససభ ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా ఆధిక్యత రాకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన ఏర్పడింది. బిజెపి, పిడిపి మధ్య ప్రభుత్వ ఏర్పాటుకు జరిగిన చర్చలు కొలిక్కి రాలేదు. మద్దతు తీసుకోవడానికి బిజెపికి పిడిపి షరతులు పెట్టింది. ఆ షరతులకు అంగీకరించడానికి బిజెపి సిద్ధంగా లేదు. దీంతో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాల్లో కూడా ప్రతిష్టంభన ఏర్పడింది.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications