షోపియాన్ ఎన్కౌంటర్: నలుగురు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లోని షోపియాన్లో జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. కిలూర ప్రాంతంలో ఉగ్రవాదులు తలదాచుకుంటున్నారన్న సమాచారం మేరకు భద్రతా దళాలు శుక్రవారం గాలింపు చర్యలు చేపట్టాయి.
ఈ సమయంలోనే ఉగ్రవాదులు భద్రతా సిబ్బందిపైకి కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మరణించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

ఉగ్రవాదులు ఏ ఉగ్రవాద సంస్థకు చెందినవారనే వివరాలు తెలియాల్సి ఉందని చెప్పారు. మిగితా ఉగ్రవాదుల కోసం ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications