జయలలిత మృతి: దినకరన్, క్రిష్ణప్రియ, అమ్మ మేనేజర్ కు సమన్లు, రండి !
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై విచారణ చేస్తున్న ఆర్ముగస్వామి ఏకసభ్య విచారణ కమిషన్ టీటీవీ దినకరన్ తో పాటు మరి కొందరికి సమన్లు జారీ చేసి విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. వారంలోపు విచారణకు హాజరు కావాలని టీటీవీ దినకరన్ కు ఆదేశాలు జారీ చేశారు.
Recommended Video


శశికళ ఫ్యామిలీ వంతు !
ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యే అయిన టీటీవీ దినకరన్, శశికళ సోదరురుడు జయరామన్ కుమార్తె, జయా టీవీ సీఇవో వివేక్ సోదరి క్రిష్ణప్రియ, జయలలిత బ్రతికి ఉన్నంత వరకూ పోయెస్ గార్డెన్ లో ఆమె మేనేజర్ గా పని చేసిన పొన్ గుండ్రన్ కు ఆర్ముగస్వామి విచారణ కమిషన్ సమన్లు జారీ చేసింది.

డేట్ ఫిక్స్ చేశారు
వారం రోజుల్లోపు విచారణకు హాజరుకావాలని టీటీవీ దినకరన్ కు సూచించారు. జనవరి 2వ తేదీ విచారణకు రావాలని శశికళ మేనకోడలు క్రిష్ణప్రియకు సూచించారు. మీదగ్గర ఉన్న పక్కా ఆధారాలతో విచారణకు హాజరుకావాలని క్రిష్ణప్రియకు సూచించారు.

ఏం చేశారు, ఏం చూశారు ?
జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో మీరు అక్కడ ఏం చేశారు ? ఏం చూశారు ? అనే పూర్తి సమాచారం ఇవ్వాలని ఆర్ముగస్వామి విచారణ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తీసిన వీడియో విడుదల చేసిన టీటీవీ దినకరన్ అనుచరుడు వెట్రివేల్ కు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు.

ఎవరు వచ్చారు, ఎక్కడికి వెళ్లారు
జయలలిత ప్రాణాలతో ఉన్న సమయంలో, ఆసపత్రిలో చేరక ముందు ఆమెను ఎవరెవరు కలిశారు, ఏ కార్యక్రమాలకు ఆమె హాజరైనారు అనే పూర్తి సమాచారం రికార్డులతో సహ తీసుకురావాలని పోయెస్ గార్డెన్ లో అమ్మ మేనేజర్ గా పని చేసిన పొన్ గుండ్రన్ కు సూచించారు.

అమ్మ ఆసుపత్రి వీడియో !
ఇప్పటికే సమన్లు అందుకున్న టీటీవీ దినకరన్ వర్గం నాయకుడు వెట్రివేల్ జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తీసిన వీడియో క్లిప్పింగ్ ను ఆయన న్యాయవాది సహాయంతో ఆర్ముగస్వామి విచారణ కమిషన్ కు అందించారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications