జార్ఖండ్లో విజయం బీజేపీకి సవాలే: సీఎం హిమంత ఆసక్తికర వ్యాఖ్యలు
గౌహతి/రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు వారాల ముందు.. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి ఉన్న సవాళ్లను అంగీకరించారు. రాష్ట్రాన్ని "కఠినమైన" యుద్దభూమి అని పేర్కొన్నారు. అయితే బీజేపీ జార్ఖండ్ రాష్ట్రంలో అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు.
నవంబర్ 13న అస్సాంలో జరగనున్న ఉప ఎన్నికలను పర్యవేక్షించడానికి కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉందని, రాష్ట్రంలో ప్రచారంపై తన ప్రయత్నాలను కేంద్రీకరించానని జార్ఖండ్ ఎన్నికలకు సంబంధించి బీజేపీ కో-ఇన్చార్జ్ బిశ్వ శర్మ అన్నారు . 'నేను ఇక్కడ ఉప ఎన్నికలపై నిఘా ఉంచడం లేదు. నేను జార్ఖండ్తో చాలా బిజీగా ఉన్నాను' అని శర్మ గౌహతిలో మీడియా సమావేశంలో ప్రసంగించారు.

జార్ఖండ్ రాష్ట్రంలో బీజేపీ అవకాశాలపై వ్యాఖ్యానిస్తూ.. 'ఇది కఠినమైన రాష్ట్రం. కానీ అక్కడ మంచి ఫలితాలు వస్తాయని మేము ఆశిస్తున్నాము' బిశ్వశర్మ తెలిపారు. ఇదిలా ఉండగా, అస్సాం మంత్రులు, ఎమ్మెల్యేలు, బిజెపి రాష్ట్ర నాయకత్వం రాష్ట్రంలో రాబోయే ఐదు అసెంబ్లీ ఉప ఎన్నికల కోసం చురుకుగా ప్రచారం చేస్తున్నాయని శర్మ చెప్పారు. 'నేను ఈసారి ఇక్కడ ప్రచారం చేస్తానో లేదో నాకు ఖచ్చితంగా తెలియదు. నేను సమయాన్ని నిర్వహించగలిగితే.. బహుశా నేను ఒకటి లేదా రెండు చోట్ల ప్రచారం చేస్తాను' అని బిశ్వశర్మ ఉపఎన్నికల ప్రచారంపై పేర్కొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు రాజ్నాథ్ సింగ్ , అమిత్ షా , నితిన్ గడ్కరీ, ధర్మేంద్ర ప్రధాన్, శివరాజ్ సింగ్ చౌహాన్లతో సహా జార్ఖండ్కు 40 స్టార్ క్యాంపెయినర్లను బీజేపీ ఇటీవల ప్రకటించింది . ఉత్తరప్రదేశ్కు చెందిన యోగి ఆదిత్యనాథ్, హర్యానాకు చెందిన నయాబ్ సింగ్ సైనీ వంటి ప్రముఖ ముఖ్యమంత్రులు కూడా ఈ జాబితాలో ఉన్నారు.
ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (AJSU), జనతాదళ్ (యునైటెడ్), లోక్ జనశక్తి పార్టీలతో కలిసి ఏర్పాటైన కూటమితో జార్ఖండ్కు 66 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను శనివారం బీజేపీ వెల్లడించింది. బీజేపీ 68, ఏజేఎస్యూ 10, జేడీ-యూ 2, ఎల్జేపీ ఒక చోట పోటీ చేయనున్నాయి. కాగా, రెండు దశల్లో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 13, 20 తేదీల్లో జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు నవంబర్ 23న జరగనుంది.












Click it and Unblock the Notifications