విద్యాశాఖ మంత్రి జగర్నాథ్ మహతో కన్నుమూత: కోవిడ్ సోకిన రెండేళ్ల తర్వాత విషాదం
రాంఛీ: జార్ఖండ్ రాష్ట్ర విద్యాశఆఖ మంత్రి జగర్నాథ్ మహతో(Jagarnath Mahto) గురువారం కన్నుమూశారు. గత కొద్ది నెలలుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కాగా, మంత్రికి 2020లో కరోనా వైరస్ సోకి కోలుకున్న అనంతరం ఊపిరితిత్తుల మార్పి శస్త్రచికిత్స జరిగింది.
అప్పట్నుంచి మంత్రి తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ట్విట్టర్ వేదికగా ఆయన కుటుంబానికి సంతాపం తెలిపారు. జార్ఖండ్ ముక్తి మోర్చా నేత మరణంతో పార్టీకి కోలుకోలేని నష్టం జరిగింది. ఈరోజు రాష్ట్రం ఒక పోరాట వీరుడు, ప్రజల కోసం కష్టపడే నాయకుడ్ని కోల్పోయింది అని వ్యాఖ్యానించారు.

చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంత్రి జగర్నాథ్ మహతో ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతిని కలిగించాలి. ఆయన కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను అని సీఎం హేమంత్ సోరెన్ పోస్టు చేశారు. గిరిధ్ డుమ్రీకి ప్రాతినిథ్యం వహించిన మంత్రి మహతో గత నెలలో జరిగిన రాష్ట్ర బడ్జెట్ సమావేశంలో అస్వస్థతకు గురవ్వడంతో చెన్నైకి తరలించారు.
-
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
చరిత్ర సృష్టించిన భారత ఆయిల్ ట్యాంకర్ 'జగ్ విక్రమ్'.. 20 వేల టన్నుల LPGతో హార్మూజ్ ను దాటి..












Click it and Unblock the Notifications