జియో కొత్త ఆఫర్ వచ్చేసింది: రూ.399 రీఛార్జ్ చేసుకుంటే పండగే..!
నూతన సంవత్సరం సందర్భంగా ప్రముఖ టెలికాం దిగ్గజం జియో ఓ సరికొత్త ఆఫర్ను కస్టమర్స్కోసం ప్రకటించింది. ఈ ఆఫర్ కింద రూ.399తో రీచార్జ్ చేసుకుంటే కూపన్స్ రూపంలో 100శాతం క్యాష్ బ్యాక్ ఇస్తోంది. అయితే ఈ కూపన్స్ ఏజియో ఆన్లైన్ ఈ-కామర్స్ పోర్టల్లో వినియోగించుకోవచ్చని సంస్థ తెలిపింది.
" ఏజియో ఈ-కామర్స్ పోర్టల్తో జియో భాగస్వామి అయ్యింది. జియో కస్టమర్లకు జియో హ్యాపీ న్యూఇయర్ ఆఫర్ ఇస్తోంది. కూపన్ల రూపంలో 100శాతం క్యాష్ బ్యాక్ ఇస్తోంది. ఏజియో కూపన్లు వినియోగించి మైజియో యాప్లోని మై కూపన్స్ సెక్షన్ ద్వారా ఈ ఆఫర్ను వినియోగించుకోవచ్చు "అని ఒక ప్రకటన ద్వారా జియో సంస్థ వెల్లడించింది. ఏజియో యాప్లో రూ.1000తో షాపింగ్ చేసిన వారు ఈ కూపన్లను రిడీమ్ చేసుకోవచ్చంటూ పేర్కొంది.

ఇక ఈ ఆఫర్ కొత్త కస్టమర్లకు ఇప్పటికే ఉన్న పాత కస్టమర్లకు వర్తిస్తుందని స్పష్టం చేసింది. అయితే డిసెంబర్ 28,2018 నుంచి జనవరి 31,2019 మధ్య రీచార్జ్ చేసుకున్న వారికి మాత్రమే ఈ ఆఫర్ లభిస్తుందని స్పష్టం చేసింది. ఈ మధ్యకాలంలో రీఛార్జ్ చేసుకున్న వారికి లభించే కూపన్లు వినియోగించుకునేందుకు చివరి తేదీ మార్చి 15, 2019 అని వివరించింది జియో సంస్థ. 2016 జియో ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి కొత్త సంవత్సరానికి జియో ఆనవాయితీగా ఒక ఆఫర్ ప్రకటించడం విశేషం.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications