సామాన్యులకు శుభవార్త.. వచ్చే సంవత్సరం తగ్గనున్న ఇళ్ల ధరలు..!
దేశంలోని ప్రధాన నగరాల్లో రియల్ ఎస్టేట్ భారీగా పెరిగిపోయింది. దీంతో సామాన్యులు ఇళ్లు కొనే పరిస్థితి లేదు. ముఖ్యంగా అద్దెలు కూడా భారీగా పెరిగిపోయాయి. కొన్ని చోట్ల 10 నుంచి 15 శాతం అద్దెలు పెరిగాయి. గత 2 సంవత్సరాల్లో దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఇళ్ల కొనుగోలు చేయగల స్తోమత తగ్గినట్లు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ జేఎల్ఎల్ ఇండియా నివేదిక వెల్లడించింది.
అయితే ఇది వచ్చే ఏడాది మెరుగుపడవచ్చని అంచనా వేసింది. కొత్త సంవత్సరంలో రెపో రేటు తగ్గింపునకు అవకాశం ఉందని పేర్కొంది. ద్రవ్యోల్బణం ఎక్కువ కావడం, రెపో రేటూ పెరగడంతో 2022లో ఇళ్ల కొనుగోలు తగ్గిందని వివరించింది. వచ్చే ఏడాది రెపోరేటులో 60 నుంచి 80 బేసిస్ పాయింట్ల తగ్గింపును జేఎల్ఎల్ అంచనా వేస్తోంది.

డేటా ప్రకారం, ముంబైలో స్థోమత సూచిక 92 నుంచి 88కి తగ్గుతుందని అంచనా వేశారు. ఢిల్లీ-ఎన్సీఆర్లో ఇండెక్స్ 125 నుంచి 121కి, బెంగళూరు సూచీ 168 నుంచి 158కి పడిపోయిందని అంచనా వేశారు. హైదరాబాద్లో గత ఏడాది 174 వద్ద ఉన్న సూచీ 169 దగ్గరకు వెళ్లింది. పూణేలో 183 నుంచి 182కి స్వల్పంగా తగ్గే అవకాశం ఉందట.
కరోనా కారణంగా చాలా వరకు నిర్మాణ పనులు నెమ్మదించాయని.. దీంతో ఇళ్లకు డిమాండ్ పెరిగినట్లు అంచనా వేస్తున్నారు. వచ్చే సంవత్సరం చాలా వరకు ఇళ్లు అందుబాటులోకి వచ్చే అవకాశం. డిమాండ్ తగ్గితే ఇళ్ల ధరలు తగ్గే అవకాశం ఉంది.
-
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది












Click it and Unblock the Notifications