పోటీ నుంచి తప్పుకున్న శ్రీరాములు భార్య, రంగంలోకి గాలి జనార్దన్ రెడ్డి, వార్ వన్ సైడ్ కాదు, పోటీ !
బళ్లారి లోక్సభ ఎన్నికలకు సమర్పించిన నామినేషన్ పత్రాల ఉపసంహరణ చివరి రోజు ఒక అభ్యర్థి తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోగా 10 మంది అభ్యర్థులు తుది రంగంలో ఉన్నారని జిల్లా ఎన్నికల అధికారి ప్రశాంత్కుమార్ మిశ్రా తెలిపారు. కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు, బళ్లారి లోక్ సభ నియోజక వర్గం బీజేపీ అభ్యర్థి బళ్లారి శ్రీరాములు భార్య భాగ్యలక్ష్మి ఆమె నామినేషన్ పత్రాలను ఉపసంహరించుకున్నారు.
ఏప్రిల్ 12వ తేదీ నుంచి ఏప్రిల్ 19వ తేదీ వరకు నామినేషన్లు సమర్పించారు. మొత్తం 11 మంది అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఏప్రిల్ 20వ తేదీన జరిగిన నామినేషన్ పత్రాల పరిశీలనలో 11 మంది అభ్యర్థుల నామినేషన్ పత్రాలను ఆమోదించారు. నామినేషన్ పత్రాల ఉపసంహరణ రోజు స్వతంత్ర అభ్యర్థి బి. భాగ్యలక్ష్మి తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నారని ఎన్నికల అధికారులు తెలిపారు.

బళ్లారి లోక్సభ ఎన్నికల రెండో దశలో జరుగుతున్నాయి. ఇప్పుడు మాజీ మంత్రి శ్రీరాములు భార్య నామినేషన్ పత్రాలు వాపస్ తీసుకున్నారు. పార్టీలకతీతంగా శ్రీరాములు, రాములు భార్య భాగ్యలక్ష్మి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. తన నామినేషన్ తిరస్కరణకు గురవుతుందనే భయంతో మాజీ మంత్రి శ్రీరాములు భార్య భాగ్యలక్ష్మి పార్టీయేతర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఎన్నికల అధికారులు ఇద్దరి నామినేషన్ పత్రాలను ఆమోదించారు.
శ్రీరాములు నామినేషన్ పత్రాలు ఆమోదించడంతో ఆయన భార్య గొండారె భాగ్యలక్ష్మి తన నామినేషన్ పత్రాన్ని ఉపసంహరించుకున్నారు. బీజేపీ నుంచి మాజీ మంత్రి బళ్లారి శ్రీరాములు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇ. తుకారాం, బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి వాల్మీకి కృష్ణప్పతో సహ జాతీయ, ప్రాంతీయ పార్టీలకు చెందిన మొత్తం 10 మంది అభ్యర్థులు బళ్లారి లోక్ సభ ఎన్నికల తుదిపోరులో ఉన్నారు. మాజీ మంత్రి, మైనింగ్ కింగ్, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి ఇటీవలే మళ్లీ బీజేపీలో చేరడంతో ఇప్పుడు బళ్లారి రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి.












Click it and Unblock the Notifications