బెంగళూరు రేప్: గ్యాంగ్రేప్ వ్యాఖ్యపై మంత్రి యూటర్న్
బెంగళూరు: ఒక మహిళ పైన ఇద్దరు మగవాళ్లు అత్యాచారానికి పాల్పడితే దానిని సామూహిక అత్యాచారం అనలేమనే అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేసిన కర్ణాటక హోంమంత్రి కేజే జార్జ్... తాను చేసిన వ్యాఖ్యల పైన ఆ తర్వాత వివరణ ఇచ్చారు.
ఇటీవల బెంగళూరులో కాల్ సెంటర్ ఉద్యోగిని గ్యాంగ్ రేప్ పైన స్పందిస్తూ బుధవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సామూహిక అత్యాచారానికి మంత్రి కొత్త నిర్వచనం చెబుతున్నారంటూ ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
దీంతో శుక్రవారం జార్జ్ తనవ్యాఖ్యలపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఒకరికంటే ఎక్కువమంది అత్యాచారానికి పాల్పడితే భారత శిక్షా స్మృతి సెక్షన్ 376(డి) కింద కేసు నమోదవుతుందని మాత్రమే తానన్నానని చెప్పారు.

నలుగురైదుగురు కలిసి చేసిన అకృత్యాన్నే గ్యాంగ్ రేప్ అంటారని వ్యాఖ్యానించానన్నారు. ఈ కేసులో యువతిపై ఇద్దరు అత్యాచారానికి పాల్పడ్డారని, ఒక మహిళను పలువురు కలిసి బహిరంగంగా అత్యాచారం చేస్తే, దానిని సామూహిక అత్యాచారంగా ప్రజలు భావిస్తున్నారని, తాను అదే అన్నానని వివరించారు.
ఈ ఘటనలో సామూహిక అత్యాచారంగానే పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యల అంశాన్ని జాతీయ మహిళా కమిషన్ తనంతట తానుగా విచారణకు చేపట్టింది. తక్షణం వివరణ ఇవ్వాలంటూ ఆయనకు నోటీసులు పంపించింది.
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!











Click it and Unblock the Notifications