ఏప్రిల్ 22 నుంచి కేదార్ నాథ్ దర్శనం
మహా శివరాత్రి పర్వదినం వేళ శైవ భక్తులకు గుడ్ న్యూస్.. దాదాపు 6 నెలల తర్వాత కేదార్ నాథ్ ఆలయం తిరిగి తెరుచుకోనుంది. ఈ మేరకు ఏప్రిల్ 22న ఉదయం 8 గంటలకు తెరిచేందుకు ముహూర్తం ఖరారు అయింది. అలాగే ఏప్రిల్ 23న బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకోనున్నాయి. ఇక ఏప్రిల్ 19న గంగోత్రి, యమునోత్రి ఆలయాలు కూడా తెరుచుకోనున్నట్లు దేవస్థానం బోర్డు అధికారులు తెలిపారు.
దేశంలోని ప్రఖ్యాత చార్ ధామ్ (ఉత్తరాఖండ్) పుణ్యక్షేత్రాల దర్శనానికి ఏటా వచ్చే భక్తుల కోసం దేవస్థానం బోర్డు ఏర్పాట్లు చకచకా చేస్తోంది. ఈమేరకు ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్నాథ్ ఆలయాన్ని దాదాపు 6 నెలల తర్వాత తెరవనున్నారు. ఏప్రిల్ 22న ఉదయం 8 గంటలకు తెరిచేందుకు ముహూర్తం ఖరారు చేసింది దేవస్థానం బోర్డు. అలాగే బద్రీనాథ్ ఆలయాన్ని ఏప్రిల్ 23న, గంగోత్రి, యమునోత్రి ఆలయాలను ఏప్రిల్ 19న తెరిచేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ నాలుగు ఆలయాలను మంచు కారణంగా మూసివేసిన తర్వాత ఏటా ఏప్రిల్, మే నెలల్లో తిరిగి తెరుస్తుంటారు.
ఇక ఉత్తరాఖండ్ లో ఉన్న బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి, కేదార్ నాథ్ ను చార్ ధామ్ అని పిలుస్తుంటారు. చార్ ధామ్ యాత్ర కోసం ఏటా లక్షలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. ఈ యాత్ర సాధారణంగా హరిద్వార్, రిషికేష్ లేదా డెహ్రాడూన్ నుండి ప్రారంభమవుతుంది. యమునోత్రి.. గంగోత్రి.. కేదార్ నాథ్.. బద్రీనాథ్ ఇలా వరుస క్రమంలో దర్శనం చేసుకోవడం సాంప్రదాయంగా వస్తోంది. అయితే చార్ ధామ్ యాత్రకు వెళ్లే భక్తులు ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి అని అధికారులు తెలిపారు.

ఇదిలాఉంటే.. చార్ ధామ్ కనెక్టివిటీకి సంబంధించి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల కీలకమైన విషయాలను వెల్లడించారు. 125 కి. మీ. రిషికేశ్- కర్ణ్ ప్రయాగ్ రైలు మార్గం ప్రాజెక్టుకు ఆమోదం లభించింది. గంగోత్రి, యమునోత్రి, కేదార్ నాథ్, బద్రీనాథ్ లకు రైలు మార్గాన్ని విస్తరించడానికి సర్వేలు పూర్తైనట్లు తెలిపారు. అలాగే మార్చి 2026 నాటికి రూ. 40,384 కోట్లు ఖర్చుతో ఉత్తరాఖండ్ లో మొత్తం 216 కి. మీ. ల మూడు కొత్త రైలు మార్గాలపై పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications