ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ క్షమాపణలు... 'మళ్లీ అలా చేయను'
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మరోమారు ఢిల్లీ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ గతంలో చేసిన తప్పును పునరావృతం కానివ్వనని హామీ ఇచ్చారు.
గత ఎన్నికల్లో విజయం సాధించి కాంగ్రెస్ మద్దతుతో ముఖ్యమంత్రి పదవి చేపట్టి 49 రోజుల పాలన అనంతరం అరవింద్ కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంకెప్పుడు అలా చేయనని, ప్రజలకు హామీ ఇచ్చారు.

ఈ సారి మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ పుల్ మెజార్జీని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 2013లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు, ఫిబ్రవరి 7న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను పూర్తిగా వ్యత్యాసం ఉందని వ్యాఖ్యానించారు.
70 అసెంబ్లీ స్ధానాలున్న ఢిల్లీలో 28 సీట్లను కైవసం చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గత ఏడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ వారణాసి లోక్ సభ నుంచి ప్రధాని నరేంద్రమోడీపై పోటీ చేసి ఓడిపోయారు.












Click it and Unblock the Notifications