లుడో, షటిల్, దొంగ పోలిస్ తీసుకొచ్చిన గొడవ, సొంత అక్కపై 8 ఏళ్ల బాలుడు పోలీసులకు ఫిర్యాదు
కరోనా వైరస్ వల్ల లాక్డౌన్ కొనసాగుతోంది. దీంతో స్కూల్ లేకపోవడంతో పిల్లలు ఆటల్లో మునిగిపోతున్నారు. అయితే కేరళలో ఓ పిల్లాడిని తన సోదరి, ఆమె స్నేహితులు ఆడిపించుకోవడం లేదు. దీంతో ఉమర్ నిదర్ అనే కుర్రాడు.. ఏకంగా పోలీసులను ఆశ్రయించాడు. తాను అబ్బాయి అయినందున.. తనను ఆడనివ్వడం లేదు అని ఫిర్యాదులో బాలుడు తెలిపారు.
తన సోదరి, ఆమె స్నేహితులు.. ల్యూడో, షటిల్, దొంగ పోలీసు ఆటలు ఆడుకొంటున్నారని బాలుడు పేర్కొన్నారు. ఈ విషయాన్ని బాలుడు తండ్రితో చెప్పడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేయమని సరదాగా అంటే అతను సీరియస్గా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Recommended Video
లాక్ డౌన్ వల్ల పిల్లాడు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అతని స్నేహితులతో ఆడుకోవడం వీలుకాకపోవంతో.. అక్కతో ఆడుకోవాలని చూస్తే వారు ఎగతాళి చేయడంతో ఆందోళన చెందాడు. వెంటనే స్థానిక పోలీసు స్టేషన్ వద్ద ఫిర్యాదు చేశాడు. మూడో తరగతి చదువుతున్న ఉమర్ నిదర్.. ఇంగ్లీష్లో ఫిర్యాదు చేశాడు. కంప్లైంట్ ఆధారంగా పోలీసులు చుట్టుపక్కల వారిని విచారించారు. విద్యార్థి నుంచి ఫిర్యాదు తీసుకున్నాక.. వెంటనే విచారిస్తామని పోలీసులు పేర్కొన్నారు. కానీ మరునాడే రావాలని విద్యార్థి పట్టుబట్టడంతో.. విచారణ చేపట్టారు.