Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆర్ఎస్ఎస్ కార్యకర్త రాజేష్ హత్య, విజయన్‌కు రాజ్‌నాథ్‌ ఫోన్

కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్త రాజేష్ హత్యకు గురయ్యారు. అయితే ఈ ఘటనపై కేంద్రహోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఫోన్ చేశారు.

తిరువనంతపురం: కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్త రాజేష్ హత్యకు గురయ్యారు. అయితే ఈ ఘటనపై కేంద్రహోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఫోన్ చేశారు. మరో వైపు ఈ ఘటనకు సంబంధించి ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.

34 ఏళ్ళ రాజేష్ అనే ఆర్ఎస్ఎస్ కార్యకర్తను శుక్రవారం రాత్రి కొందరు వ్యక్తులు దాడి చేశారు. అయితే ఆయన తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటనపై బిజెపి రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది.

Kerala: Five taken into custody for RSS worker murder

అయితే రాజేష్‌ను సిపిఎం కార్యకర్తలే హత్య చేశారని బిజెపి ఆరోపించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే పాతకక్షలే హత్యకు కారణమై ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ముఖ్యమంత్రి విజయన్‌కు ఫోన్ చేశారు అయితే ఈ ఘటనకు పాల్పడినవారు ఎవరైనా చర్యలు తీసుకొంటామని హోంమంత్రికి విజయన్‌ సమాధానమిచ్చారు. ఈ మేరకు సిఎంఓ తెలిపింది.

మరో వైపు ఈ ఘటనకు కారకులుగా అనుమానిస్తున్న ఐదుగురు సిపిఎం కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. వారిని పోలీసులు విచారిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+