ఆల్ టైమ్ రికార్డ్... కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ శైలజా టీచర్దే...
నలభై దశాబ్దాల చరిత్రను తిరగరాస్తూ కేరళలో వరుసగా రెండోసారి ఎల్డీఎఫ్ అధికారాన్ని కైవసం చేసుకుంది. ఆదివారం(మే 2) వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎల్డీఎఫ్ కూటమి 91 స్థానాల్లో విజయం సాధించింది. ఆరోగ్యశాఖ మంత్రి కెకె శైలజ అందరి కంటే ఎక్కువ మెజారిటీతో విజయం సాధించారు. మట్టన్నూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రికార్డు స్థాయిలో 67,013 ఓట్ల మెజారిటీతో ఆమె గెలుపొందారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ ఇదే అత్యధిక మెజారిటీ కావడం విశేషం.
మంత్రి శైలజను చాలామంది శైలజ టీచర్ అని పిలుస్తుంటారు. గతంలో 23 ఏళ్ల పాటు ఆమె ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. 2004లో ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. గతంలో డెమోక్రాటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డీవైఎఫ్ఐ),సీపీఎం యూత్ విభాగంలో పనిచేశారు. 2016లో ఎల్డీఎఫ్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తొలిసారిగా ఆమె మంత్రి అయ్యారు. అప్పటి ఎన్నికల్లో కుతుపరంబ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన శైలజ... 12,291 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తాజా ఎన్నికల్లో ఏకంగా 60వేల పైచిలుకు మెజారిటీ సాధించారు.

64 ఏళ్ల ఈ మహిళా నేత 2017-2018లో కేరళను నిఫా వైరస్ వణికించిన సమయంలో ఆరోగ్య శాఖ మంత్రిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించి అంతర్జాతీ స్థాయిలో భేష్ అనిపించుకున్నారు.తాజా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఎల్డీఎఫ్ తరుపున పాపులర్ క్యాంపెయినర్గా వ్యవహరించారు. ఎన్నికల్లో విజయంపై ఫేస్బుక్లో స్పందించిన మంత్రి శైలజ...'ఈ ఎన్నికల్లో నన్ను గెలిపించినందుకు మట్టన్నూర్ ప్రజలకు ధన్యవాదాలు..' అని పేర్కొన్నారు.
కేరళలో ఇప్పటివరకూ అత్యధిక మెజారిటీ 45,587 ఓట్లే కావడం గమనార్హం. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో కేరళ కాంగ్రెస్ నేత పీజే జోసెఫ్కి ఈ మెజారిటీ దక్కింది. తాజా ఎన్నికల్లో ముఖ్యమంత్రి పినరయి విజయన్ 50వేల మెజారిటీతో గెలుపొందారు. ధర్మందం నియోజకవర్గం నుంచి ఆయన గెలుపొందారు.
రాష్ట్రంలో మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు గాను 99 స్థానాల్లో ఎల్డీఎఫ్ కూటమి విజయం సాధించింది. మ్యాజిక్ ఫిగర్ను సునాయాసంగా దాటేసింది. దీంతో కేరళలో కొత్త చరిత్ర సృష్టించినట్లయింది. గత నాలుగు దశాబ్దాలుగా కేరళలో ప్రతీ ఐదేళ్లకోసారి ప్రభుత్వం మారుతూ వస్తోంది. ఒకసారి ఎల్డీఎఫ్కు,మరోసారి యూడీఎఫ్కు ప్రజలు అవకాశం ఇస్తూ వస్తున్నారు. కానీ మొదటిసారి ఆ పరంపరను బ్రేక్ చేస్తూ వరుసగా రెండోసారి ఎల్డీఎఫ్ తమ అధికారాన్ని నిలుపుకుంది.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications