కేసు వాపస్ తీసుకుంటే రూ.5 కోట్లు ఇస్తాను: కేరళ నన్కు బిషప్ ఆఫర్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళ నన్ అత్యాచారఘటనలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. అత్యాచారం కేసు వాపసు తీసుకుంటే రూ.5 కోట్లు ఇస్తానని బిషప్ ఆఫర్ చేసినట్లు బాధితురాలి సోదరుడు తెలిపారు. బిషప్ ఫ్రాంకోములక్కల్ బంధువుతో పాటు మరో ఇద్దరు పాస్టర్లు బాధితురాలి సోదరుడి స్నేహితులను కలిసి ఈ ఆఫర్ ఇచ్చారు.
పోలీసుల సమాచారం మేరకు ఈ ఘటనపై ఓ హైలెవెల్ మీటింగ్ జరుగుతుంది. ఆ తర్వాత కేసును కేరళ హైకోర్టు విచారణ జరగనుంది. అంతకుముందు బిషప్కు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. అనంతరం ఆయన అరెస్టుపై గురువారం జరిగే మీటింగ్లో నిర్ణయం తీసుకుంటారు. అత్యాచార ఘటనలో పోలీసులు ఎలాంటి విచారణ చేస్తున్నారో..ఇప్పటి వరకు చేపట్టిన విచారణ విధానం కోర్టుకు తెలపాలని ఆదేశించింది. మరోవైపు బాధితురాలి సంరక్షణ కొరకు తీసుకున్న చర్యలు ఏమిటని కూడా పోలీసులను ప్రశ్నించింది న్యాయస్థానం.

బిషప్ కేసును మూయించేందుకు రాజకీయంగాను డబ్బులు పరంగాను తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని వాటికన్లో కూడా పిటిషన్ దాఖలు చేసింది బాధితురాలు. కేసునుంచి తప్పించుకునేందుకు డయాస్ నిధులను బిషప్ వినియోగిస్తున్నారని వాటికన్కు రాసిన పిటిషన్లో ఆమె వెల్లడించారు. 2014 నుంచి 2016ల మధ్య ఫ్రాంకో ములక్కల్ తనపై 13 సార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆమె ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే తాను నిర్దోషినని తనకు ఏమి తెలియదని బిషప్ ఫ్రాంకో ములక్కల్ చెబుతున్నారు.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications