టెక్కీ కిరాతకం: తండ్రిని చంపి ముక్కలుగా కోశాడు
తిరువనంపురం: ఆస్తి కోసం ఓ కసాయి కుమారుడు తన తండ్రిని అత్యంత కిరాకతకంగా హత్య చేశాడు. తండ్రిని చంపి ఆ తర్వాత ఆయన శరీరాన్ని ముక్కలుగా కోశాడు. ఈ ఘాతుకానికి పాల్పడింది చదువు సంధ్యలు లేని వ్యక్తి కాదు, ఓ సాఫ్ట్వేర్ ఇంజనీరు. కేరళలోని చెంగన్నూరులో వారం క్రితం ఈ సంఘటన జరిగింది.
అయితే, ఆ విషయం ఆలస్యంగా సోమవారంనాడు వెలుగు చూసింది. షెరిన్ జాన్ (36) ఐటి హబ్ోని టెక్నోపార్క్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన తండ్రి జాయ్ వి. జాన్ (68) మూడు దశాబ్దాలుగా అమెరికాలో ఉంటున్నాడు. వారం క్రితం అతను తన పూర్వీకుల ఇంటికి వచ్చాడని, ఆ తర్వాత హత్యకు గురయ్యాడని చెబుతున్నారు.
షెరిన్ వాంగ్మూలం ఆధారంగా పోలీసులు వివిధ ప్రాంతాల నుంచి జాయ్ తల, కాలు, ఇతర అవయవాలు సేకరించారు. గత బుధవారం ఎసి మరమ్మత్తు కోసం కుమారుడితో కలిసి వెళ్లిప్పటి నుంచి ఆయన కనిపించకుండా పోయాడు. వారిద్దరు కూడా తిరిగి రాలేదని జాయ్ భార్య మరియమ్మ ఫిర్యాదు చేసింది.
ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, కేసు మిస్టరీని ఛేదించారు. తన తండ్రిని తానే చంపానని అంగీకిరంచడంతో పోలీులు షెరిన్ జాన్ను అరెస్టు చేశారు. తండ్రీకొడుకుల మధ్య ఆస్తి తగాదాల కారణంగానే ఈ హత్య జరిగినట్లు గుర్తించారు.