కేజ్రీవాల్‌కు చేయి: నరేంద్ర మోడీకే కిరణ్ బేడీ ఓటు

Kiran Bedi
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఆయన మాజీ మద్దతుదారు కిరణ్ బేడీ దూరమయ్యారు. ఆమె కేజ్రీవాల్‌ను కాకుండా బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీని బలపరుస్తూ ముందుకు వచ్చారు. ప్రధానిగా నరేంద్ర మోడీకే ఆమె ఓటేస్తున్నారు.

తనకు ప్రథమ ప్రాధాన్యం భారత్ అని, మంచి పాలన, మంచి యంత్రాంగం, నిజాయితీ, భాగస్వామ్య విధానం కారణంగా ఓ స్వతంత్ర ఓటరుగా తాను నరేంద్ర మోడీకి ఓటేస్తానని ఆమె ట్విట్టర్‌లో రాశారు. అన్నా హజారే, కేజ్రీవాల్ అవినీతి వ్యతిరేక పోరాటంలో పాలు పంచుకున్న కిరణ్ బేడీ ఇప్పుడు మోడీకి మద్దతు తెలుపుతున్నారు.

కుంభకోణాలను అంతం పలకాలని భావించే ఎవరు కూడా మరోసారి కాంగ్రెసు పార్టీకి ఓటేయరని ఆమె అన్నారు. భారత్‌కు స్థిరత్వం, అనుభవం గలవారు అవసరమని ఆమె అన్నారు. అరవింద్ కేజ్రీవాల్‌ను, ఆయన జట్టును దేవుడు రక్షించాలని ఆమె అన్నారు.

ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయాల్లో విలువలను మార్చిందని, ఇది దేశానికంతటికీ మంచిదని కిరణ్ బేడీ అన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా తాను ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి కేజ్రీవాల్ కిరణ్ బేడీని ఆహ్వానించారు. అయితే ఆమె హాజరు కాలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+