చట్టాలు రద్దు చేసే వరకూ పోరాటం - పార్లమెంట్ కు ట్రాక్టర్ ర్యాలీ : ఏడాది పూర్తవుతున్న రైతుల ఆందోళన..!!

దాదాపుగా ఏడాది కాలంగా ఆందోళనలు చేస్తున్న రైతులు...మూడు రైతు చట్టాలు రద్దు చేసే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని ప్రకటించారు. ప్రధాని మోదీ గురునానక్ జయంతి నాడు తాము తీసుకొచ్చిన మూడు రైతు చట్టాలను ఉప సంహరించుకుంటున్నట్లుగా ప్రకటించారు. రైతులకు క్షమాపణ చెప్పారు. ఈ నెల 29వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో ఆ చట్టాల ఉప సంహరణ ప్రక్రియ పూర్తి చేస్తామని వెల్లడించారు. రైతులు తమ నిరసనలను విరమించి నివాసాలకు వెళ్లాలని ప్రధాని పిలుపునిచ్చారు.

అయితే, చట్టాలను పూర్తిగా రద్దు చేసే ఆందోళన కొసాగించాలని సంయుక్త కిసాన్​ మోర్చా (ఎస్​కేఎమ్​) తేల్చిచెప్పింది. చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభించి ఏడాది గడుస్తున్న నేపథ్యంలో.. ఈ నెల 26న దేశంలో వివిధ ప్రాంతాల్లో నిర్వహించే ఆందోళనలకు రైతులు భారీ సంఖ్యలో తరలి రావాలని విజ్ఞప్తి చేసింది. ఆ రోజున.. ట్రాక్టర్లు, ఎడ్లబండ్లతో పరేడ్​ నిర్వహిస్తామని వెల్లడించింది. ఈ నెల 29న పార్లమెంట్ సమావేశాల సందర్భంగా శాంతియుత ట్రాక్టర్ ర్యాలీలను నిర్వహిస్తాం. ఎమ్​ఎస్​పీ కల్పించేలా బిల్లు తీసుకురావాలి డిమాండ్ చేసింది.

KSM decided to go ahead with the pre-decided programmes of the farmers’ agitation till November 29

విద్యుత్​ బిల్లులను రద్దు చేసేవరకు ఈ పోరాటం కొనసాగుతుందని ఓ ప్రకటనలో ఎస్​కేఎమ్​ తెలిపింది.ఈ నెల 22న నిర్వహిస్తున్న 'కిసాన్ మహాపంచాయత్'​తో పెద్దసంఖ్యలో రైతులు పాల్గొనాలని విజ్ఞప్తి చేసింది. దాదాపు 670 మంది రైతులు బలిదానం చేసుకున్నారు. వారి కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలి. ఈ పోరాటానికి ఓ స్మారకాన్ని నిర్మించాలి. రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రధాని ప్రకటన పైన భిన్న వాదనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సమయంలో రైతు సంఘాలు మాత్రం తమ డిమాండ్లు పూర్తిగా నెరవేరే వరకూ వెనుకడుగు వేసేది లేదని స్పష్టం చేస్తున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+