ఎన్నో దారులుండగా: శ్వేతాబసు వ్యవహారంపై ఖుష్బూ
చెన్నై: టాలీవుడ్ నటి శ్వేతాబసు వ్యహారం పైన తమిళనాడుకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకురాలు, ప్రముఖ నటి ఖుష్బూ మంగళవారం స్పందించారు. శ్వేతాబసు వ్యవహారాన్ని ఆమె తప్పు పట్టినట్లుగా తెలుస్తోంది. తాను ప్రాస్టిట్యూషన్లోకి వెళ్లేందుకు శ్వేతాబసు చెప్పిన కారణాలను ఆమె తప్పుపట్టినట్లుగా తెలుస్తోంది.
కెరీర్లో చాలామంది నటులకు ఇలాంటి సమస్యలు వస్తాయని, సమస్యలు వచ్చినప్పుడు లేదా ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు టీవీలలో నటించడం లేదా కేరక్టర్ ఆర్టిస్ట్ రోల్లో నటించడం వంటి పలు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని ఖుష్బూ చెప్పినట్లుగా తెలుస్తోంది.
ఇన్ని ప్రత్యామ్నాయాలు ఉండగా.. కేవలం వ్యభిచారాన్నే ఎంచుకోవడాన్ని ఆమె తప్పుపట్టినట్లుగా సమాచారం. ఇది సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. దీనికి ఆమె తల్లిదండ్రులు ఎలా అంగీకరిస్తారని ఆమె ప్రశ్నించారని తెలుస్తోంది. ఈ విషయంలో వారిని కూడా ఆమె తప్పుపట్టినట్లుగా తెలుస్తోంది.
కాగా, శ్వేతాబసు వ్యవహారంలో ఆమెకు సినిమా ప్రముఖుల నుండి మద్దతు లభిస్తోన్న విషయం తెలిసిందే. చాలామంది ఆమె పైన జాలి పడుతున్నారు. గతంలో ఓ హిందీ సీరియల్లో శ్వేతకు తల్లిగా నటించిన సాక్షి మీడియా తీరును తప్పుపట్టారు కూడా.