Lady: అత్త గొంతు నీట్ గా కోసేసి ఎస్కేప్ అయిన కిలాడీ కోడలు, ఇంట్లో ఏం జరిగిదంటే ?, కొడుకు చూస్తే !
చెన్నై/ చెంగల్పట్టు: ఒకే ఇంటిలో నివాసం ఉంటున్న అత్తా కోడలి మద్య చిన్నచిన్న గొడవలు జరుగుతున్నాయి. అత్తా కోడలి మద్య ప్రతినిత్యం జరుగుతున్న చిన్న గొడవలు రానురాను పెద్ద గొడవలు అయ్యాయి. అత్తా కోడలు ఒకరిని చూస్తే ఒక్కరు రాయి టెంకాయలా తయారైనారు. అత్త భోజనం పెట్టమంటే కోడలు ఇంట్లో అన్నం, సాంబార్ చేసిన పాత్రాలు విసిరివిసిరి కొట్టింది. భర్త అతని భార్య, తల్లికి ఇంతకాలం సర్దిచెబుతూ వచ్చాడు. అయితే పరిస్థితి చెయ్యి దాటిపోయింది. ఉదయం భర్త పని మీద బయటకు వెళ్లాడు. తరువాత ఇంట్లో అత్తా కోడలు, కోడలు ఇద్దరు కూతుర్లు మాత్రమే ఉన్నారు. రాత్రి ఇంటికి వెళ్లిన కొడుకు రక్తపుమడుగులో పడి ఉన్న తల్లిని చూసి హడలిపోయాడు. అప్పటికే తల్లీ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని తెలుసుకుని ఆర్తనాదాలు చేశాడు. ఇంట్లో భార్య కూడా కనపడకపోవడంతో అతను పోలీసులను ఆశ్రయించాడు. అత్త గొంతు కోసి చంపేసిన కోడలు తప్పించుకుని పారిపోందని పోలీసుల విచారణలో వెలుగు చూడటంతో స్థానికులు హడలిపోయారు.
కొడుకుతో పాటు ఉంటున్న తల్లి
తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలోని తిరుక్కలుక్కురం బజారు రోడ్డులో బిందుకుమార్ (37) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. బిందుకుమార్ కు సుజాతా (27) అనే భార్య ఉంది బిందు కుమార్ తల్లి ప్రేమా కూడా వీళ్లతో నే నివాసం ఉంటున్నారు. బిందు కుమార్ ఇద్దరు సోదరులు చెన్నైలో నివాసం ఉంటున్నారు.
అత్తా కోడలు ఫైటింగ్
కొన్ని రోజులు బిందు కుమార్ దగ్గర ఉంటున్న ప్రేమా కొన్ని రోజులు చెన్నైలో ఉంటున్న మరో ఇద్దరి కొడుకుల దగ్గర ఉంటున్నారు. ఒకే ఇంటిలో నివాసం ఉంటున్న అత్తా ప్రేమా, ఆమె కోడలు సుజాతాల మద్య చిన్నచిన్న గొడవలు జరుగుతున్నాయి. అత్తా ప్రేమా కోడలు సుజాతాల మద్య ప్రతినిత్యం జరుగుతున్న చిన్న గొడవలు రానురాను పెద్ద గొడవలు అయ్యాయి.
సర్ది చెబుతున్న భర్త
అత్తా కోడలు ఒకరిని చూస్తే ఒక్కరు రాయి టెంకాయలా తయారైనారు. అత్త ప్రేమా భోజనం పెట్టమంటే ఆమె కోడలు సుజాతా ఇంట్లో అన్నం, సాంబార్ చేసిన పాత్రాలు విసిరివిసిరి కొట్టింది. భర్త బిందు కుమార్ అతని భార్య సుజాతా, తల్లి ప్రేమాకు ఇంతకాలం సర్దిచెబుతూ వచ్చాడు. అయితే పరిస్థితి చెయ్యి దాటిపోయింది.
అత్తను గొంతు కోసి చంపేసి కోడలు ఎస్కేప్
ఉదయం బిందు కుమార్ పని మీద బయటకు వెళ్లాడు. తరువాత ఇంట్లో అత్తా ప్రేమా, ఆమె కోడలు సుజాతా, సుజాతా ఇద్దరు కూతుర్లు మాత్రమే ఉన్నారు. రాత్రి ఇంటికి వెళ్లిన బిందు కుమార్ రక్తపుమడుగులో పడి ఉన్న తల్లి ప్రేమాను చూసి హడలిపోయాడు. అప్పటికే తల్లీ ప్రేమా ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని తెలుసుకున్న బిందు కుమార్ ఆర్తనాదాలు చేశాడు. ఇంట్లో భార్య సుజాతా కూడా కనపడకపోవడంతో బిందు కుమార్ పోలీసులను ఆశ్రయించాడు. అత్త ప్రేమా గొంతు కోసి చంపేసిన ఆమె కోడలు సుజాతా తప్పించుకుని పారిపోందని పోలీసుల విచారణలో వెలుగు చూడటంతో స్థానికులు హడలిపోయారు.