వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎగ్జిట్ పోల్స్ తప్పవుతాయి: ముందే ఊహించిన లాలూ (ట్వీట్)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: "గుర్తుంచుకోండి... బీహార్లో ఎన్నికల అనంతరం అన్ని ఎగ్జిట్ పోల్స్ తప్పని రుజువైంది. వాస్తవ ఫలితాలకు ఏ ఒక్క సంస్థ కూడా కనీసం దగ్గరకు రాలేకపోయింది. నిశ్శబ్ధంగా, 19వ తేదీ వరకూ వేచి చూడండి" సరిగ్గా రెండు రోజుల క్రితం బీహార్ రాజధాని పాట్నాలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.


బీహార్ విషయంలో ఎగ్జిట్ పోల్స్ ఎలాగైతే తప్పు అయ్యాయో, తమిళనాడులో అదే జరగవచ్చని ఆర్జేడీ అధినేత లాలూ చేసిన వ్యాఖ్యలు అక్షరాలా ఇప్పుడు నిజమయ్యాయి. పోలింగ్ రోజున వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఆమెకు వ్యతిరేకంగా రావడంతో ఆమె ఇంటికి పరిమితమయ్యారు.

చివరి శ్వాస వరకు: నమ్మకం వమ్ము కాలేదని కార్యకర్తలతో 'అమ్మ' చివరి శ్వాస వరకు: నమ్మకం వమ్ము కాలేదని కార్యకర్తలతో 'అమ్మ'

జాతీయ ఎగ్జిట్ పోల్స్ సర్వేలన్నీ కూడా అమ్మను ఇంటికి పంపించి కరుణానిధి నేతృత్వంలోని డీఎంకే కూటమి అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. కానీ గురువారం వెల్లడైన తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ తప్పుని తేలాయి.

lalu prasad yadav predicts on exit polls of five states

ఒక్క టైమ్స్ నౌ - సీఓటర్స్, తమిళనాడులోని లోకల్ చానళ్లు మాత్రమే ముఖ్యమంత్రిగా జయలలిత తిరిగి అధికారంలోకి వస్తుందని వెల్లడించాయి. ఈ ఎన్నికల్లో పోలింగ్ నాడు వర్షం తగ్గిన తరువాత మహిళలు అత్యధికంగా ఓటు హక్కును వినియోగించుకోవడం అన్నాడీఎంకేకు కలిసివచ్చిందని సీఓటర్స్ విశ్లేషించింది.

మైలేజీ ఎక్కడ తగ్గింది?: ఓటర్లు కరుణ చూపిన సీఎం పీఠానికి కరుణానిధి దూరం సరిగ్గా అదేవిధంగా ఈరోజు వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో అన్నాడీఎంకే పార్టీ ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించింది. సాధారణంగా తమిళనాడులో ఐదేళ్లకోసారి ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయం కొనసాగుతోంది. కానీ ఈసారి జయలలిత ఆ సంప్రదాయాన్ని తిరగరాసారు. తమిళనాడులో అన్నాడీఎంకే చీఫ్‌ జయలలిత వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టనున్నారు.

ఎన్నికల్లో విజయం సాధించినందుకు గాను ప్రధాని నరేంద్రమోడీ జయలలితకు స్వయంగా ఫోన్ చేసి ఆమెతో మాట్లాడారు. దీంతో ప్రధాని అభినందనలను స్వీకరించి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారని పార్టీ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. 1984 తర్వాత అంటే, 32 ఏళ్ల తర్వాత తమిళనాడులో వరుసగా రెండోసారి ఒక ముఖ్యమంత్రి అధికారం చేపట్టడం ఇదే మొదటిసారి.

English summary
lalu prasad yadav predicts on exit polls of five states
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X