ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిపై చిరుత దాడి: తలను వేరు చేసి..
కోయంబత్తూరు: తమిళనాడు కోయంబత్తూరు ప్రాంతంలోని పొల్లాచ్చి పట్టణంలో గురువారం దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇంటి సమీపంలోని టీ ప్లాంటేషన్ దగ్గర ఆడుకుంటున్న ఓ నాలుగేళ్ల చిన్నారిపై చిరుత దాడి చేసింది.
ఇది గమనించిన కొందరు చిన్నారిని కాపాడేందుకు ప్రయత్నించారు. అయితే, చిరుతపులి ఆ చిన్నారిని వేగంగా లాక్కెళ్లిందని స్థానికులు చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు.. ఆ చిన్నారి కోసం ముమ్మర గాలింపు చేపట్టారు.

శుక్రవారం ఉదయం 3గంటల వరకు ఈ గాలింపు కొనసాగింది. శుక్రవారం ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో ఆ చిన్నారి తల లేని మొండెం లభ్యమైంది. పోస్టుమార్టం నిమిత్తం దాన్ని ఆస్పత్రికి తరలించారు. చిన్నారి మృతితో ఆమె కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.












Click it and Unblock the Notifications