న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో శుక్రవారం రాజ్యసభ ఎన్నికలు జరిగాయి. మొత్తం 25 సీట్ల కోసం యూపీ, పశ్చిమబెంగాల్, కర్ణాటక, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. ఒక్క ఉత్తరప్రదేశ్లోనే పది స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మరోవైపు శుక్రవారం సాయంత్రమే కౌంటింగ్ కూడా మొదలైంది.
శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రాజ్యసభ ఎన్నికల పోలింగ్ సాగింది. యూపీలో 10 సీట్లకు ఎన్నికలు జరగ్గా, బీజేపీ 8, ఎస్పీ ఒక స్థానంలో సులభంగా గెలిచేందుకు అవకాశం ఉంది. అయితే పదో స్థానం కోసం బీజేపీ అదనంగా బరిలో దించిన అభ్యర్థికి, బీఎస్పీ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది.
విడుదలవుతున్న ఫలితాలు....
Mar 23, 2018, 11:25 pm IST
9 మంది బీజేపీ అభ్యర్థుల గెలుపు అనంతరం యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తమ పార్టీ అభ్యర్థుల గెలుపునకు తోడ్పడిన పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
Mar 23, 2018, 11:23 pm IST
చత్తీస్గఢ్లో కూడా బీజేపీ జయకేతం ఎగురవేసింది. ఆ పార్టీ రాజ్యసభ అభ్యర్థి సరోజ్ పాండే తన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి సాహూపై విజయం సాధించారు.
Mar 23, 2018, 10:25 pm IST
సంచలనం.. యూపీలో పదో స్థానం ఫలితాలు కూడా వెలువడ్డాయి. బీజేపీ అభ్యర్థి అనిల్ అగర్వాల్ గెలుపొందారు. బీఎస్పీ అభ్యర్థి బీఆర్ అంబేద్కర్పై రెండో విడత ఓట్ల లెక్కింపులో అనిల్ అగర్వాల్ విజయం సాధించారు. దీంతో యూపీలో రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు పూర్తయింది.
Mar 23, 2018, 10:20 pm IST
యూపీలో బీజేపీ తొమ్మిదో స్థానానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలి విడత లెక్కింపులో బీఎస్పీకి చెందిన బీఆర్ అంబేద్కర్కు 32 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి అనిల్ అగర్వాల్కు కేవలం 16 ఓట్లే వచ్చాయి. ప్రస్తుతం రెండో విడత ఓట్ల లెక్కింపు జరుగుతోంది. 9వ సీటుపై బీజేపీ గెలుపు ధీమా వ్యక్తం చేస్తోంది.
Mar 23, 2018, 10:16 pm IST
యూపీ నుంచి బీజేపీ తరుపున రాజ్యసభకు ఎన్నికైన వారి వివరాలు.. అరుణ్ జైట్లీ, అశోక్ బాజ్పాయ్, విజయపాల్ సింగ్ తోమర్, సకల్ దీప్ రాజ్భర్, కాంత కర్దమ్, అనిల్ జైన్, హర్నాథ్ సింగ్ యాదవ్, జీవీఎల్ నర్సింహారావు.
Mar 23, 2018, 10:12 pm IST
యూపీలో గెలుపొందిన ఎనిమిది మంది బీజేపీ అభ్యర్థులకు 39 చొప్పున ఓట్లు పోలవగా, సమాజ్వాది పార్టీ నుంచి ఎన్నికైన జయాబచ్చన్కు 38 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ అందరి దృష్టి పదో సీటుపైనా ఉంది.
Mar 23, 2018, 10:10 pm IST
ఉత్తరప్రదేశ్లో 8 రాజ్యసభ స్థానాలను బీజేపీ కైవసం చేసుకోగా, సమాజ్వాది పార్టీ ఒక స్థానం గెలుచుకుంది. సమాజ్వాది పార్టీ నుంచి జయా బచ్చన్ రెండొోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు.
Mar 23, 2018, 10:01 pm IST
రాజ్యసభకు ఎన్నికైనా అనంతరం కర్నాటక బీజేపీ అభ్యర్థి రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆనందం వ్యక్తం చేశారు. తనను నమ్మి అత్యధిక ఓట్లు వేసి గెలిపించడం సంతోషంగా ఉందన్నారు. కర్ణాటకకు, తన సిటీ బెంగళూరుకు సేవలందించడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు.
I am very happy to have received the maximum number of votes. Happy with the trust shown in me. It is an honor for me to serve Karnataka & serve my city Bengaluru: Rajeev Chandrashekhar, BJP after winning #RajyaSabhaElections from Karnataka pic.twitter.com/cDPOTsWHj5
కర్ణాటకలో కాంగ్రెస్ తరుపున రాజ్యసభలో అడుగుపెట్టనున్న వారు .. హనుమంతయ్య, నసీర్ హుస్సేన్, జీసీ చంద్రశేఖర్. వీరంతా తొలిసారిగా రాజ్యసభకు ఎన్నికైన వారు. రిటర్నింగ్ అధికారి కాంగ్రెస్ అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ జనతాదళ్(ఎస్) నిశ్చయించుకుంది.
Mar 23, 2018, 9:51 pm IST
కర్ణాటకలో రోజంతా హైడ్రామా నడిచింది. కాంగ్రెస్కు చెందిన ముగ్గురు అభ్యర్థులు గెలవగా, బీజేపీ తరపున రాజీవ్ చంద్రశేఖర్ ఎన్నికయ్యారు. ఈయన రాజ్యసభకు గెలుపొందటం ఇది మూడోసారి కాగా, బీజేపీ తరుపున గెలుపొందటం మాత్రం ప్రథమం.
Mar 23, 2018, 9:48 pm IST
తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థికి కేవలం 10 ఓట్లు మాత్రమే వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి డి.ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేసినప్పటికీ దాన్ని చెల్లని ఓటుగా ఎన్నికల కమిషన్ ధ్రువీకరించింది.
Mar 23, 2018, 9:46 pm IST
తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్కు చెందిన ముగ్గురు అభ్యర్థులు రాజ్యసభకు ఎన్నికయ్యారు. బి.ప్రకాష్, జె.సంతోష్ కుమార్ యాదవ్, ఎ.బి.లింగయ్యయాదవ్ రాజ్యసభకు వెళ్లనున్నారు.
Mar 23, 2018, 9:01 pm IST
జార్ఖండ్ వికాస్ మోర్చా ఎమ్మెల్యే ప్రకాష్ రామ్కు వ్యతిరేకంగా ఆ పార్టీ అధినేత చేసిన ఫిర్యాదును ఎన్నికల కమిషన్ తోసిపుచ్చింది. అంతకుముందు ప్రకాష్ రామ్ క్రాస్ ఓటింగ్కు పాల్పడినట్లుగా జేవీఎం ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఓటు వేస్తున్న సమయానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజిని పరిశీలించిన అనంతరం ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది.
Mar 23, 2018, 8:45 pm IST
ఇక్కడ బీజేపీ అభ్యర్థుల విషయంలో చాలాసేపు హైడ్రామా చోటుచేసుకుంది. క్రాస్ ఓటింగ్, తప్పుడు ఓటింగ్కు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తినప్పటికీ సమీర్ ఉరాన్, ప్రదీప్ సొంతాలియాలను చివరికి గెలుపు వరించింది.
Mar 23, 2018, 8:41 pm IST
జార్ఖండ్లో రెండు రాజ్యసభ సీట్లనూ బీజేపీ కైవసం చేసుకుంది.
Mar 23, 2018, 8:34 pm IST
బీహార్లో సీపీఐ(ఎంఎల్)కు చెందిన రాజ్కుమార్ యాదవ్ ఓటు కూడా క్యాన్సిల్ అయ్యేలా ఉంది. ఎందుకంటే, ఆయన కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయడంతోపాటు ‘నోటా’పై కూడా టిక్ పెట్టినట్లు అధికారులు తెలిపారు.
Mar 23, 2018, 8:31 pm IST
ఉత్తరప్రదేశ్లో బీజేపీ, బీఎస్పీలకు ఎదురుదెబ్బ తగిలింది. పొరపాటుగా ఓటు వేయడంతో ఈ రెండు పార్టీలకు చెందిన ఒక్కో ఓటును అధికారులు లెక్కించలేదు. పదో స్థానానికి పోటీ పడుతున్న తరుణంలో ఈ పరిణామం రెండు పార్టీలకు గొడ్డలిపెట్టు లాంటిదే.
Mar 23, 2018, 8:28 pm IST
కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కె.తిమ్మప్ప, సీహెచ్ బాబూరావు ఓటు వేసే సమయంలో పొరపాటు చేయంతో అధికారులు వారికి మరో అవకాశం ఇచ్చారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఎన్నికల కమిషన్ వారి ఓట్లు తిరస్కరించాల్సిందిగా రిటర్నింగ్ అధికారిని ఆదేశించింది.
Mar 23, 2018, 8:03 pm IST
కర్ణాటకలోనూ రాజ్యసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అంతకుముందు రిటర్నింగ్ ఆఫీసర్ ఎస్ మూర్తి కాంగ్రెస్ అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరించారంటూ జనతాదళ్(ఎస్) అభ్యర్థి బీఎం ఫారూఖ్ ఆరోపించారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారికి, జేడీఎస్ అభ్యర్థికి నడుమ వాగ్వాదం చోటుచేసుకుంది.
Mar 23, 2018, 8:00 pm IST
క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారనే ఆరోపణలపై ప్రకాష్ రామ్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు జార్ఖండ్ వికాస్ మోర్చా(జేవీఎం) అధినేత బాబూలాల్ మరాండి ప్రకటించారు.
Mar 23, 2018, 7:51 pm IST
జార్ఖండ్లో ప్రకాష్ రామ్ క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారంటూ జార్ఖండ్ వికాస్ మోర్చా ఆరోపించింది. ఈ మేరకు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. ప్రకాష్ రామ్ ఓటును క్యాన్సిల్ చేయాలని డిమాండ్ చేసింది. దీంతో ఇక్కడ ఓట్ల లెక్కింపు దాదాపు రెండు గంటలపాటు నిలిచిపోయింది.
Mar 23, 2018, 7:47 pm IST
జార్ఖండ్లోనూ ఓట్ల లెక్కింపు మొదలైంది. ఇక్కడ కూడా ఓట్ల లెక్కింపు రెండు గంటలపాటు అలస్యమైంది. అయితే ఫలితాలను మాత్రం ప్రకటించరాదని ఎన్నికల కమిషన్ అధికారులను ఆదేశించింది.
Mar 23, 2018, 7:43 pm IST
పశ్చిమ బెంగాల్లో టీఎంసీ పార్టీకి చెందిన అభ్యర్థులు అబిర్ రంజన్ బిస్వాస్, శుభాశీస్ చక్రవర్తి, నడిముల్ హాక్యూ, శంతనుసేన్ రాజ్యసభ ఎన్నికల్లో గెలిచారు.
Mar 23, 2018, 7:40 pm IST
పశ్చిమ బెంగాల్ నుంచి కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ మను సింఘ్వీ గెలుపొందారు. ఈయనకు కాంగ్రెస్ సభ్యులతోపాటు టీఎంసీ సభ్యులు కూడా ఓట్లు వేశారు.
Mar 23, 2018, 7:27 pm IST
ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీ అభ్యర్థి సీఎం రమేష్ ఏకగ్రీవంగా రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Mar 23, 2018, 7:19 pm IST
యూపీలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. బీఎస్పీ ఫిర్యాదుతో అంతకుముందు ఇక్కడ ఓట్ల లెక్కింపును ఈసీ కాసేపు నిలిపివేసింది. ఎమ్మెల్యేలు నితిన్ అగర్వాల్, అనిల్ సింగ్ ఓటు వేసే ముందు పోలింగ్ ఏజెంట్లకు తమ ఓటును చూపించలేదని బీఎస్పీ ఆరోపించింది.
Mar 23, 2018, 7:17 pm IST
గన్ పార్క్ దగ్గర టీఆర్ఎస్ శ్రేణుల సంబురాలు. టపాసులు పేలుస్తూ, మిఠాయిలు పంచారు. మహిళలు బతుకమ్మ ఆడుతూ గెలిచిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు.
Mar 23, 2018, 7:17 pm IST
తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ ఓటమి పాలయ్యారు.
తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ ఓటమి పాలయ్యారు.
7:17 PM, 23 Mar
గన్ పార్క్ దగ్గర టీఆర్ఎస్ శ్రేణుల సంబురాలు. టపాసులు పేలుస్తూ, మిఠాయిలు పంచారు. మహిళలు బతుకమ్మ ఆడుతూ గెలిచిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు.
7:19 PM, 23 Mar
యూపీలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. బీఎస్పీ ఫిర్యాదుతో అంతకుముందు ఇక్కడ ఓట్ల లెక్కింపును ఈసీ కాసేపు నిలిపివేసింది. ఎమ్మెల్యేలు నితిన్ అగర్వాల్, అనిల్ సింగ్ ఓటు వేసే ముందు పోలింగ్ ఏజెంట్లకు తమ ఓటును చూపించలేదని బీఎస్పీ ఆరోపించింది.
7:27 PM, 23 Mar
ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీ అభ్యర్థి సీఎం రమేష్ ఏకగ్రీవంగా రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
7:40 PM, 23 Mar
పశ్చిమ బెంగాల్ నుంచి కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ మను సింఘ్వీ గెలుపొందారు. ఈయనకు కాంగ్రెస్ సభ్యులతోపాటు టీఎంసీ సభ్యులు కూడా ఓట్లు వేశారు.
7:43 PM, 23 Mar
పశ్చిమ బెంగాల్లో టీఎంసీ పార్టీకి చెందిన అభ్యర్థులు అబిర్ రంజన్ బిస్వాస్, శుభాశీస్ చక్రవర్తి, నడిముల్ హాక్యూ, శంతనుసేన్ రాజ్యసభ ఎన్నికల్లో గెలిచారు.
7:47 PM, 23 Mar
జార్ఖండ్లోనూ ఓట్ల లెక్కింపు మొదలైంది. ఇక్కడ కూడా ఓట్ల లెక్కింపు రెండు గంటలపాటు అలస్యమైంది. అయితే ఫలితాలను మాత్రం ప్రకటించరాదని ఎన్నికల కమిషన్ అధికారులను ఆదేశించింది.
7:51 PM, 23 Mar
జార్ఖండ్లో ప్రకాష్ రామ్ క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారంటూ జార్ఖండ్ వికాస్ మోర్చా ఆరోపించింది. ఈ మేరకు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. ప్రకాష్ రామ్ ఓటును క్యాన్సిల్ చేయాలని డిమాండ్ చేసింది. దీంతో ఇక్కడ ఓట్ల లెక్కింపు దాదాపు రెండు గంటలపాటు నిలిచిపోయింది.
8:00 PM, 23 Mar
క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారనే ఆరోపణలపై ప్రకాష్ రామ్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు జార్ఖండ్ వికాస్ మోర్చా(జేవీఎం) అధినేత బాబూలాల్ మరాండి ప్రకటించారు.
8:03 PM, 23 Mar
కర్ణాటకలోనూ రాజ్యసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అంతకుముందు రిటర్నింగ్ ఆఫీసర్ ఎస్ మూర్తి కాంగ్రెస్ అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరించారంటూ జనతాదళ్(ఎస్) అభ్యర్థి బీఎం ఫారూఖ్ ఆరోపించారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారికి, జేడీఎస్ అభ్యర్థికి నడుమ వాగ్వాదం చోటుచేసుకుంది.
8:28 PM, 23 Mar
కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కె.తిమ్మప్ప, సీహెచ్ బాబూరావు ఓటు వేసే సమయంలో పొరపాటు చేయంతో అధికారులు వారికి మరో అవకాశం ఇచ్చారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఎన్నికల కమిషన్ వారి ఓట్లు తిరస్కరించాల్సిందిగా రిటర్నింగ్ అధికారిని ఆదేశించింది.
8:31 PM, 23 Mar
ఉత్తరప్రదేశ్లో బీజేపీ, బీఎస్పీలకు ఎదురుదెబ్బ తగిలింది. పొరపాటుగా ఓటు వేయడంతో ఈ రెండు పార్టీలకు చెందిన ఒక్కో ఓటును అధికారులు లెక్కించలేదు. పదో స్థానానికి పోటీ పడుతున్న తరుణంలో ఈ పరిణామం రెండు పార్టీలకు గొడ్డలిపెట్టు లాంటిదే.
8:34 PM, 23 Mar
బీహార్లో సీపీఐ(ఎంఎల్)కు చెందిన రాజ్కుమార్ యాదవ్ ఓటు కూడా క్యాన్సిల్ అయ్యేలా ఉంది. ఎందుకంటే, ఆయన కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయడంతోపాటు ‘నోటా’పై కూడా టిక్ పెట్టినట్లు అధికారులు తెలిపారు.
8:41 PM, 23 Mar
జార్ఖండ్లో రెండు రాజ్యసభ సీట్లనూ బీజేపీ కైవసం చేసుకుంది.
8:45 PM, 23 Mar
ఇక్కడ బీజేపీ అభ్యర్థుల విషయంలో చాలాసేపు హైడ్రామా చోటుచేసుకుంది. క్రాస్ ఓటింగ్, తప్పుడు ఓటింగ్కు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తినప్పటికీ సమీర్ ఉరాన్, ప్రదీప్ సొంతాలియాలను చివరికి గెలుపు వరించింది.
9:01 PM, 23 Mar
జార్ఖండ్ వికాస్ మోర్చా ఎమ్మెల్యే ప్రకాష్ రామ్కు వ్యతిరేకంగా ఆ పార్టీ అధినేత చేసిన ఫిర్యాదును ఎన్నికల కమిషన్ తోసిపుచ్చింది. అంతకుముందు ప్రకాష్ రామ్ క్రాస్ ఓటింగ్కు పాల్పడినట్లుగా జేవీఎం ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఓటు వేస్తున్న సమయానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజిని పరిశీలించిన అనంతరం ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది.
9:46 PM, 23 Mar
తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్కు చెందిన ముగ్గురు అభ్యర్థులు రాజ్యసభకు ఎన్నికయ్యారు. బి.ప్రకాష్, జె.సంతోష్ కుమార్ యాదవ్, ఎ.బి.లింగయ్యయాదవ్ రాజ్యసభకు వెళ్లనున్నారు.
9:48 PM, 23 Mar
తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థికి కేవలం 10 ఓట్లు మాత్రమే వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి డి.ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేసినప్పటికీ దాన్ని చెల్లని ఓటుగా ఎన్నికల కమిషన్ ధ్రువీకరించింది.
9:51 PM, 23 Mar
కర్ణాటకలో రోజంతా హైడ్రామా నడిచింది. కాంగ్రెస్కు చెందిన ముగ్గురు అభ్యర్థులు గెలవగా, బీజేపీ తరపున రాజీవ్ చంద్రశేఖర్ ఎన్నికయ్యారు. ఈయన రాజ్యసభకు గెలుపొందటం ఇది మూడోసారి కాగా, బీజేపీ తరుపున గెలుపొందటం మాత్రం ప్రథమం.
9:56 PM, 23 Mar
కర్ణాటకలో కాంగ్రెస్ తరుపున రాజ్యసభలో అడుగుపెట్టనున్న వారు .. హనుమంతయ్య, నసీర్ హుస్సేన్, జీసీ చంద్రశేఖర్. వీరంతా తొలిసారిగా రాజ్యసభకు ఎన్నికైన వారు. రిటర్నింగ్ అధికారి కాంగ్రెస్ అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ జనతాదళ్(ఎస్) నిశ్చయించుకుంది.
10:01 PM, 23 Mar
రాజ్యసభకు ఎన్నికైనా అనంతరం కర్నాటక బీజేపీ అభ్యర్థి రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆనందం వ్యక్తం చేశారు. తనను నమ్మి అత్యధిక ఓట్లు వేసి గెలిపించడం సంతోషంగా ఉందన్నారు. కర్ణాటకకు, తన సిటీ బెంగళూరుకు సేవలందించడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు.
I am very happy to have received the maximum number of votes. Happy with the trust shown in me. It is an honor for me to serve Karnataka & serve my city Bengaluru: Rajeev Chandrashekhar, BJP after winning #RajyaSabhaElections from Karnataka pic.twitter.com/cDPOTsWHj5
ఉత్తరప్రదేశ్లో 8 రాజ్యసభ స్థానాలను బీజేపీ కైవసం చేసుకోగా, సమాజ్వాది పార్టీ ఒక స్థానం గెలుచుకుంది. సమాజ్వాది పార్టీ నుంచి జయా బచ్చన్ రెండొోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు.
10:12 PM, 23 Mar
యూపీలో గెలుపొందిన ఎనిమిది మంది బీజేపీ అభ్యర్థులకు 39 చొప్పున ఓట్లు పోలవగా, సమాజ్వాది పార్టీ నుంచి ఎన్నికైన జయాబచ్చన్కు 38 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ అందరి దృష్టి పదో సీటుపైనా ఉంది.
10:16 PM, 23 Mar
యూపీ నుంచి బీజేపీ తరుపున రాజ్యసభకు ఎన్నికైన వారి వివరాలు.. అరుణ్ జైట్లీ, అశోక్ బాజ్పాయ్, విజయపాల్ సింగ్ తోమర్, సకల్ దీప్ రాజ్భర్, కాంత కర్దమ్, అనిల్ జైన్, హర్నాథ్ సింగ్ యాదవ్, జీవీఎల్ నర్సింహారావు.
10:20 PM, 23 Mar
యూపీలో బీజేపీ తొమ్మిదో స్థానానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలి విడత లెక్కింపులో బీఎస్పీకి చెందిన బీఆర్ అంబేద్కర్కు 32 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి అనిల్ అగర్వాల్కు కేవలం 16 ఓట్లే వచ్చాయి. ప్రస్తుతం రెండో విడత ఓట్ల లెక్కింపు జరుగుతోంది. 9వ సీటుపై బీజేపీ గెలుపు ధీమా వ్యక్తం చేస్తోంది.
10:25 PM, 23 Mar
సంచలనం.. యూపీలో పదో స్థానం ఫలితాలు కూడా వెలువడ్డాయి. బీజేపీ అభ్యర్థి అనిల్ అగర్వాల్ గెలుపొందారు. బీఎస్పీ అభ్యర్థి బీఆర్ అంబేద్కర్పై రెండో విడత ఓట్ల లెక్కింపులో అనిల్ అగర్వాల్ విజయం సాధించారు. దీంతో యూపీలో రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు పూర్తయింది.
11:23 PM, 23 Mar
చత్తీస్గఢ్లో కూడా బీజేపీ జయకేతం ఎగురవేసింది. ఆ పార్టీ రాజ్యసభ అభ్యర్థి సరోజ్ పాండే తన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి సాహూపై విజయం సాధించారు.
11:25 PM, 23 Mar
9 మంది బీజేపీ అభ్యర్థుల గెలుపు అనంతరం యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తమ పార్టీ అభ్యర్థుల గెలుపునకు తోడ్పడిన పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
The stage is set for Rajya Sabha polls on Friday for the remaining 25 seats in seven states including Uttar Pradesh. The Narendra Modi-led BJP government at the Centre, currently has 58 members, four more than the Congress.