Wife: లవ్ మ్యారేజ్, భార్యకు దిక్కులేనంతమంది బాయ్ ఫ్రెండ్స్, ఎదురు కట్నాలు, మేడమ్ మొబైల్ లో ?
చెన్నై/రామనాథపురం: సోషల్ మీడియాలో యువతి, యువకుడికి పరిచయం అయ్యింది. యువకుడు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. చాలాకాలం పాటు ఇద్దరు సోషల్ మీడియాలో చాటింగ్ చేసుకుని తరువాత వీడియె కాల్స్ లో మాట్లాడుకున్నారు. ఇద్దరి మతాలు వేరుకావడంతో కుటుంబ సభ్యులను ఎదిరించిన ప్రియుడు అతని ప్రియురాలిని పెళ్లి చేసుకుని వేరుకాపురం పెట్టాడు. భార్యతో సంతోషంగా కాపురం చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగి ఆమెకు ఇప్పటికే భారీ మొత్తంలో బంగారు నగలు కొనిఇచ్చాడు. భర్త మొబైల్ ఫోన్ నీళల్లో పడిపోయింది. కొన్ని రోజులు భార్య మొబైల్ ఫోన్ ఉపయోగించిన భర్త హడలిపోయాడు. తన భార్యకు 50 మందికి పైగా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని, మీరే నాకు న్యాయం చెయ్యాలని భర్త పోలీసులను ఆశ్రయించాడు.
Wife: భార్య, భర్త, ఓ బాయ్ ఫ్రెండ్, లవ్ మ్యారేజ్ చేసుకున్న భార్య ఏం చేసిదంటంటే ?. భర్తకు మండిపోయి !
ప్రభుత్వ ఉద్యోగం
తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా తిరువత్తర్ లో ముత్తురామ్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. తమిళనాడులోని. రామనాథపురం జిల్లాలోని కీఝలకరై ఫారెస్టు కార్యాలయంలోని అటవీ శాఖ కార్యాలయంలో ముత్తురామ్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఫేస్బుక్లో నజీనా పర్వీన్ అలియాస్ నజినా అనే అమ్మాయితో ముత్తురామ్ కు పరిచయం అయ్యింది. ఒకరోజు నజీనా ఆమె బాయ్ ఫ్రెండ్ ముత్తురామ్కి మెసేజ్ పంపింది. తరుాత ఇద్దరూ చాటింగ్ చేసుకుంటున్నారు.
ఐలవ్ యూ అంటే నీదే అలస్యం అని చెప్పింది
అప్పటి నుంచి ఇద్దరూ ఫేస్బుక్లో మెసేజ్ లు చేసుకుంటున్నారు. ఒకరోజు ముత్తురామ్ నజీనాతో అతని ప్రేమ గురించి చెప్పాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని ముత్తరామ్ నజీనాకు చెప్పాడు. నజీనా ఏ మాత్రం ఆలోచించకుండా ఇంతకాలం నేను నిన్ను ప్రేమిస్తున్నానని, ఎలా చెప్పాలో అర్థం కాక సైలెంట్ గా ఉన్నానని వెంటనే ముత్తురామ్ ప్రేమను అంగీకరించింది.
పెళ్లికి రెఢీ అయిన మేడమ్
తరువాత మత్తురామ్, నజీనా ఇద్దరూ 8 నెలలుగా డేటింగ్లో ఉన్నారు. 2020లో ముత్తురామ్ని పెళ్లి చేసుకోవాలని నజీనా నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని ముత్తురామ్ కు చెప్పేందుకు ఆమె ఇంట్లో కూడా ముందుగానే మాట్లాడుకుందని తెలిసింది. ఫేస్ బుక్ అమ్మాయి నజీనాను పెళ్లి చేసుకోవడానికి ముత్తురామ్ ఇంట్లో అంగీకరించలేదని తెలిసింది. అమ్మాయి నజీనా ముస్లిం మతం మారి హిందువుగా ఉంటుందా, ఎందుకు ఇలాంటి పని చేశావు అని ముత్తురామ్ ను అతని కుటుంబ సభ్యులు ప్రశ్నించారు.
నేను డాక్టర్ తెలుసా ?
నజీనా, ముత్తురామ్ కుటుంబ సభ్యులను ఎదిరించి ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. నేను డెంటిస్ట్ని. డాక్టర్ ను. రామనాథపురంలో క్లినిక్ ప్రారంభించి మనం సంతోషంగా జీవించవచ్చని నజీనా ఆమె ప్రియుడు ముత్తురామ్ కు మాయమాటలు చెప్పింది. నజీనా మాటలు నమ్మిన ముత్తురామ్ ఇంటి నుంచి పారిపోయి రామనాథపురంలో అద్దె ఇల్లు తీసుకుని నజీనాతో ఉన్నాడు.
ఎదురు కట్నం తీసుకున్న నజీనా
దంత వైద్యురాలు నజీనా రామనాథపురం వచ్చి అక్కడ ముత్తురామ్ను వివాహం చేసుకుంది. భార్య నజీనా ఒత్తిడితో ముత్తురామ్ ఇస్లాంలోకి మారాడు. ముత్తురామ్ పేరును కూడా జవహర్గా మార్చుకున్నాడు. మా మతంలో కట్నం ఇచ్చేది పురుషుడే అని, నువ్వు నాకు కట్నం ఇవ్వాలని నజీనా ఆమె భర్త ముత్తురామ్ కు టార్చర్ పెట్టింది. కట్నం కింద నజీనా హ్యుందాయ్ కారు, 40 సవర్ల నగలు, 3 లక్షల నగదు కావాలని కోరింది. ముత్తురామ్ కూడా ఇదంతా నజీనాకి ఇచ్చాడు. 2022లో పెళ్లి కావడంతో ఇన్ని రోజులు వీరి జీవితం బాగానే సాగింది.
భార్యకు 50 మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని ?
కొద్దిరోజుల క్రితం రామనాథపురంలోని ఇంటిలో ప్రమాదవశాత్తు ముత్తురామ్ ఫోన్ నీటిలో పడి తడిసిపోవడంతో అతను భార్య నజీనా ఫోన్ను తీసుకుని వాడేశాడు. నజీనా ఫోన్ చూసి ముత్తురామ్ షాక్ అయ్యాడు. సినిమాలో లాగా భార్య నజీనా ఫోన్ చూస్తే మగవాళ్ల కాంటాక్ట్స్ అన్నీ ఉన్నాయి. ఫేస్బుక్లో నజీనా చాలా మంది పురుషులతో రొమాంటిక్ గా చాట్లు చేసింది, ఆమెకు 50 మందికి పైగా పురుషులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, వారితో నిత్యం చాట్ చేసి చాలా రొమాంటిక్ గా, అసభ్యంగా తన భార్య నజీనా మెసేజ్లు పంపించిందని తెలుసుకున్న ముత్తురామ్ హడలిపోయాడు.
పుట్టింటికి వెలుతున్నానని బాయ్ ఫ్రెండ్స్ తో రొమాన్స్
చాలా మంది పురుషులను పెళ్లి చేసుకోవడానికి కూడా నజీనా ప్లాన్ చేస్తోందని ముత్తురామ్ తెలుసుకున్నాడు. సేలంలోని పుట్టింటకి వెలుతానని చెప్పి బయటకు వెళ్లిన నజీనా ఆమె బాయ్ ఫ్రెండ్స్ తో ఫొటోలు తీసుకుందని, వారితో సన్నిహితంగా ఉన్నసమయంలో తీసుకున్న ఫోటోలన్నీ ముత్తురామ్ ఆమె మొబైల లో చూసి షాక్ అయ్యాడు. తన భార్య నజీనాకు చాలా మంది మగాళ్లతో అక్రమ సంబంధం ఉందని, వారికి ఆమె నిత్యం ఐలవ్ యూ సందేశాలు పంపిందని ముత్తురామ్ తెలుసుకున్నాడు. నజీనా ఓటర్ కార్డు చూసిన ముత్తురామ్ ఆమె వయసు 28 ఏళ్లు కాదని, 33 ఏళ్లు అని తెలుసుకుని హడలిపోయాడు.
భారీ మొత్తంలో గుంజేసింది
తననే కాకుండా పలువురిని మోసం చేసిన నజీనా వారి నుంచి భారీ మొత్తంలో డబ్బులు కూడా తీసుకున్నదని నజీనా గూగుల్ పే అకౌంట్ చూసిన ముత్తురామ్ హడలిపోయాడు. నజీనా చాలా మంది పురుషుల నుండి వసూలు చేసిన నజీనా డెంటల్ క్లినిక్ని కూడా ప్రారంభించడానికి సిద్దం అయ్యిందని తెలుసుకున్న ముత్తురామ్ హడలిపోయాడు. ఇదే విషయంలో నజీనా, ముత్తురామ్ దంపతుల మద్య గొడవలు జరిగాయి. ఇదేమిటని భర్త ముత్తురామ్ ప్రశ్నించగా నీతో కలిసి జీవించలేనని చెప్పిన నజీనా సేలంకు పారిపోయింది. ఈ విషయమై తాను మోసపోయిన ముత్తురామ్ అతని భార్య నజీనా మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు రామనాథపురంలో నజీనా పర్వీన్ అలియాస్ నజీనా అనే మహిళ ఆమె భర్తను మోసం చేసి డబ్బులు వసూలు చేసిన ఘటన కలకలం రేపింది.