Lovers: ప్రియురాలికి ఇంకో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని డౌట్ ?, రొమాన్స్ కు పిలిచి ఏం చేశాడంటే ?
చెన్నై/ పుదుచ్చేరి: కాలేజ్ కు వెళ్లి చక్కగా చదువుకుంటున్న కుమార్తెను చూసిన ఆమె తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉన్నారు. ఎప్పటిలాగే కాలేజ్ కు వెళ్లిన అమ్మాయి ఇంటికి తిరిగిరాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు ఆందోళనతో పోలీసులను ఆశ్రయించారు. నిర్జనప్రదేశంలో సంచిలో కట్టిన శవం కాలిపోతున్న విషయం తెలుసుకున్న పోలీసులు మంటలు అదుపుచేసి కాలిపోతున్న శవాన్ని బయటకు తీశారు. దారుణ హత్యకు గురైయ్యింది మా అమ్మాయి అని తెలుసుకున్న కాలేజ్ అమ్మాయి కుటుంబ సభ్యులు తల్లిడిల్లిపోయారు. కాలేజ్ అమ్మాయికి మరో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడనే అనుమానంతో ఆమె ప్రియుడే దారుణంగా చంపేశాడని వెలుగు చూడటం కలకలం రేపింది.

ఇంటర్ అమ్మాయి
పుదుచ్చేరిలోని పుతువై తిరుక్కనూర్ సమీపంలోని మార్కెట్ ప్రాంతంలో రామన్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. రామన్ కుమార్తె రాజశ్రీ (17) చేతరపట్టు ప్రాంతంలోని ఓ ప్రైవేట్ కాలేజ్ లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. కాలేజ్ కు వెళ్లి చక్కగా చదువుకుంటున్న కుమార్తె రాజశ్రీని చూసి మా కష్టాలు త్వరలో తీరిపోతాయి అంటూ ఆమె తల్లిదండ్రులు చాలా సంతోషపడ్డారు.

బస్సు రాలేదని చివరి ఫోన్ కాల్
ఎప్పటిలాగే మంగళవారం ఉదయం రాజశ్రీ ఇంటి నుంచి కాలేజ్ కు వెళ్లింది. అదే రోజు మద్యాహ్నం 3 గంటల సమయంలో తల్లికి ఫోన్ చేసిన రాజశ్రీ తాను కాలేజ్ నుంచి బయటకు వచ్చానని, ఇంకా బస్సురాలేదని, బస్సు వచ్చిన వెంటనే ఊరికి వచ్చేస్తానని చెప్పింది. రాత్రి అయినా రాజశ్రీ ఇంటికి చేరుకోకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళనతో విల్లినూర్ పోలీసులను ఆశ్రయించారు.

సార్...... అక్కడ ఏదో మంటల్లో ?
పొరయూర్ ప్రాంతంలో మంటల్లో ఓ సంచి కాలిపోతుందని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసు సూపరింటెండెంట్ రంగనాథన్, ఇన్స్ పెక్టర్ క్రిష్ణన్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మంటల్లో కాలిపోతున్న సంచిలోపల యువతి శవం ఉందని గుర్తించిన పోలీసులు హడలిపోయారు. ఓ యువకుడు, అతనితో పాటు మరో కుర్రాడు బైక్ లో ఆ సంచిని తీసుకువచ్చి ఇక్కడ మంటల్లో విసిరేశారని ప్రత్యక్ష సాక్షలు పోలీసులకు చెప్పారు.

రాజశ్రీ దారుణ హత్య
సంచిలో ఉన్నన శవాన్ని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. సంచిలో ఉన్న శవం రాజశ్రీది అని ఆమె తల్లిదండ్రులు గుర్తించారు. రాజశ్రీ మొబైల్ ఫోన్ ఆధారంగా పోరూర్ పేట్ లో నివాసం ఉంటున్న ప్రదీప్ అలియాస్ ప్రదేశ్ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత మూడు సంవత్సరాల నుంచి ప్రదీప్, రాజశ్రీ ప్రేమించుకుంటున్నారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

ప్రియురాలి శీలం మీద అనుమానం
రాజశ్రీ కాలేజ్ లో వేరే యువకుడితో చనువుగా ఉంటోందని, ఇదే విషయంలో చాలాసార్లు మా మద్య గొడవ జరిగిందని ప్రదీప్ పోలీసుల విచారణలో అంగీకరించాడు. నిన్న నీతో ఏకాంతంగా మాట్లాడాలని రాజశ్రీని నిర్జనప్రదేశంలోకి పిలుచుకుని వెళ్లానని, ఆ సమయంలో మాటామాటా పెరిగిపోవడంతో తాను రాజశ్రీ మీద దాడి చేశానని, ముక్కు, చెవుల్లో రక్తం ఎక్కువగా కారిపోయి రాజశ్రీ ప్రాణాలు విడిచిందని ప్రదీప్ పోలీసులకు చెప్పాడు.

హత్య కేసులో 14 ఏళ్ల మైనర్
తన 14 ఏళ్ల తమ్ముడితో కలిసి తన ప్రియురాలు రాజశ్రీ శవాన్ని గోనే సంచిలో కట్టి ఇక్కడకు తీసుకు వచ్చి విసిరేశానని ప్రదీప్ పోలీసుల విచారణలో అంగీకరించాడు. రాజశ్రీ హత్యకు సహకరించిన ప్రదీప్ 14 ఏళ్ల సోదరుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాలేజ్ లో స్నేహితుడితో మాట్లాడుతున్న యువతిని అనుమానించిన ఆమె ప్రియుడు ఇంతదారుణంగా హత్య చెయ్యడం పదుచ్చేరిలో కలకలం రేపింది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications