బీజేపీ 7వ జాబితా: అమరావతి నుంచి నవనీత్ కౌర్ రాణా పోటీ
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే పలువురు అభ్యర్థులతో బీజేపీ 7వ జాబితాను విడుదల చేసింది. మహారాష్ట్రలోని అమరావతి (ఎస్సీ) స్థానం నుంచి గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన సినీనటి నవనీత్ కౌర్ రాణాను బరిలో దించాలని బీజేపీ నిర్ణయించింది. ఈ మేరకు బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదంతో తమ పార్టీ అభ్యర్థిగా ఆమె పేరును బుధవారం రాత్రి ప్రకటించింది.
2019 లోక్సభ ఎన్నికల్లో అమరావతి స్థానం నుంచి శివసేన నేత ఆనందరావు అడ్సుల్పై నవనీత్ రాణా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే. మరోవైపు, కర్ణాటకలోని చిత్రదుర్గ(ఎస్సీ) సీటు నుంచి కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం గోవింద్ కర్జోల్ను బరిలోకి దించింది. గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి ఎ నారాయణస్వామి గెలుపొందగా.. ఈసారి అభ్యర్థిని మార్పు చేసింది.

హర్యానా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామాతో కర్నాల్ అసెంబ్లీ స్థానం ఖాళీ కావడంతో.. అక్కడ్నుంచి ప్రస్తుత సీఎం నాయబ్ సింగ్ సైనీని పోటీలో నిలిపింది. మరోవైపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10 అసెంబ్లీ స్థానాలతోపాటు మరికొన్ని సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసింది.
కాగా, మార్చి 26న పార్టీ సార్వత్రిక ఎన్నికలకు అభ్యర్థుల ఆరో జాబితాను విడుదల చేసింది. రాజస్థాన్లోని దౌసా లోక్సభ స్థానం నుంచి కన్హయ్య లాల్ మీనా, కరౌలీ-డోల్పూర్ స్థానం నుంచి ఇందూ దేవిని పార్టీ బరిలోకి దించింది. కాగా, మణిపూర్ ఇన్నర్ స్థానం నుంచి తౌనోజం బసంత కుమార్ సింగ్ పోటీ చేయనున్నారు.
ఏపీలో అసెంబ్లీ అభ్యర్థుల జాబితా
అదోని - పీవీ పార్థ సారధి
ధర్మవరం - సత్యకుమార్
ఎచ్చెర్ల - ఎన్. ఈశ్వర్ రావు
విశాఖ నార్త్ - విష్ణు కుమార్ రాజు
అరకు - పంగి రాజారావు
విజయవాడ వెస్ట్ - సుజనా చౌదరి
కైకలూరు - కామినేని శ్రీనివాస్ రావు
అనపర్తి - శివ కృష్ణం రాజు
బద్వేల్ - బొజ్జా రోషన్న
జమ్మలమడుగు - ఆదినారాయణ రెడ్డి
కాగా, మొత్తం 543 లోక్సభ స్థానాలకు గానూ ఇప్పటి వరకు 400కుపైగా స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ 195 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను మార్చి 2న ప్రకటించింది. తొలి జాబితాలో అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, స్మృతి ఇరానీ సహా 34 మంది కేంద్ర ప్రభుత్వ మంత్రులను బీజేపీ బరిలోకి దింపింది. ఉత్తరప్రదేశ్లోని వారణాసి స్థానంలో ప్రధాని నరేంద్ర మోడీ పోటీ చేయనున్నారు.
BJP releases its list of candidates for the Andhra Pradesh Assembly elections pic.twitter.com/3O0aAeswz9
— ANI (@ANI) March 27, 2024
మార్చి 13న పార్టీ రెండో అభ్యర్థుల జాబితా విడుదలైంది. లోక్సభ ఎన్నికలకు మరో 72 మంది అభ్యర్థుల పేర్లను అందులో పేర్కొంది. రెండో జాబితాలో అనురాగ్ ఠాకూర్, మనోహర్ లాల్ ఖట్టర్, పీయూష్ గోయల్, అనిల్ బలూనీలకు చోటు దక్కింది. తొమ్మిది మంది అభ్యర్థులతో కూడిన మూడో జాబితాను మార్చి 21న విడుదల చేశారు. బీజేపీ మూడో అభ్యర్థి జాబితా ప్రకారం.. తమిళనాడు బీజేపీ చీఫ్ కె. అన్నామలై కోయంబత్తూరు నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు, కేంద్ర మంత్రి ఎల్.మురుగన్ నీలగిరి నుంచి పోటీ చేయనున్నారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications