మధ్యప్రదేశ్లో 75 శాతం ఓటింగ్: 200 సీట్లు గెలుస్తామని శివరాజ్, 140 గెలుస్తామని కాంగ్రెస్
భోపాల్: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 75 శాతం ఓటింగ్ నమోదయింది. సాయంత్రం ఆరు గంటల వరకు 74.6 శాతం ఓటింగ్ నమోదయింది. ఎంతోమంది క్యూలో ఉండగా, వారికి ఓటు వేసేందుకు అవకాశం ఇచ్చారు. మధ్యప్రదేశ్లో 230 స్థానాలకు పోలింగ్ జరిగింది.
పోలింగ్ అనంతరం ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సులభంగా 200 సీట్లు గెలుచుకొని, వరుసగా నాలుగోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
శివరాజ్ సింగ్ చౌహాన్ కుటుంబం బుధ్నీ ప్రాంతంలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకుంది. అనంతరం ఆయన ఓ మీడియా సంస్థతో మాట్లాడారు.
ప్రజలంతా తమ ఓటు హక్కు తప్పనిసరిగా వినియోగించుకోవాలన్నారు. ప్రజల ఓటు మధ్యప్రదేశ్ భవిష్యత్తునే మార్చేస్తుందన్నారు. ఎన్నికల ప్రచారంలో బీజేపీ కార్యకర్తలు బాగా కష్టపడ్డారని చెప్పారు. ఇందుకు ప్రతిఫలంగా అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తుందన్నారు. కాంగ్రెస్ నేత కమల్నాథ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పారు. తమకు 140 సీట్లకు పైగా వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
{document1}