సింధ్ బ్రిడ్జ్ తొక్కిసలాటపై రాజకీయం: విషాదం (పిక్చర్స్)
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దాతియా వద్ద గల రతన్ గఢ్ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 115కు చేరుకుంది. ఈ తొక్కిసలాట ఘటన రాజకీయ రంగు పులుముకుంది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెసు పార్టీ డిమాండ్ చేస్తోంది.
త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఘటన రాజకీయ రంగు పులుముకుంది. ఘటన జరిగిన బ్రిడ్జిపై నుండి వాహనం వెళ్లేందుకు పోలీసులు లంచం తీసుకున్నారని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. బ్రిడ్జి పై నుండి ఒక్కో ట్రాక్టరును పంపించేందుకు పోలీసులు రూ.200 తీసుకున్నారని, ఇది నో ట్రాఫిక్ జోన్ అని, ఇది మధ్య ప్రదేశ్ ప్రభుత్వ మంచి పాలన అని ట్వీట్ చేశారు.
ఈ దుర్ఘటనకు పోలీసులు, అధికారులే కారణమనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ఘటనకు కాంగ్రెసు పార్టీ రాజకీయ రంగు పులమడాన్ని భారతీయ జనతా పార్టీ తప్పు పట్టింది. మరోవైపు మృతుల సంఖ్యను తగ్గించేందుకు పోలీసులు మృతదేహాలను సింధ్ నదిలో పడవేశారనే ఆరోపణలను పోలీసు అధికారులు కొట్టి పారేశారు.

తొక్కిసలాట తర్వాత సింధ్ నది బ్రిడ్జి
దసరా పర్వదినం సందర్భంగా రతన్ గఢ్ ఆలయంలో ఆదివారం జరిగిన తొక్కిసలాట అనంతరం సింధ్ నది బ్రిడ్జి ఇలా హృదయవిదారకంగా మారిన దృశ్యం.

తొక్కిసలాట
ఆదివారం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దతియా జిల్లాలోని రతన్ గఢ్ ఆలయం వద్ద సింధ్ రివర్ బ్రిడ్జి పైన తొక్కిసలాట అనంతరం దృశ్యం.

సింధ్ రివర్ పైన ప్రజలు
ఆదివారం సింధ్ నది బ్రిడ్జి పైన తొక్కిసలాట జరిగిన అనంతరం ప్రజలు అక్కడి నుండి వెళ్తున్న దృశ్యం. తొక్కిసలాటలో దాదాపు 115 మంది మృతి చెందారు.

హృదయ విదారకం
దసరా పర్వదినం సందర్భంగా రతన్ గఢ్ ఆలయంలో ఆదివారం జరిగిన తొక్కిసలాట అనంతరం సింధ్ నది బ్రిడ్జి ఇలా హృదయవిదారకంగా మారిన దృశ్యం.

బ్రిడ్జి పైన భక్తులు
మధ్యప్రదేశ్లోని దతియా జిల్లాలోని రతన్ గఢ్ ఆలయంకు సింధ్ బ్రిడ్జి మీదుగా పెద్ద సంఖ్యలో వెళ్తున్న భక్తులు. ఈ బ్రిడ్జి పైన తొక్కిసలాట జరిగింది.

తొక్కిసలాట తర్వాత
దసరా పర్వదినం సందర్భంగా రతన్ గఢ్ ఆలయంలో ఆదివారం జరిగిన తొక్కిసలాట అనంతరం సింధ్ నది బ్రిడ్జి ఇలా హృదయవిదారకంగా మారిన దృశ్యం.
-
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications