వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం: 11 మంది మృతి, 4గురికి తీవ్ర గాయాలు
ముంబై: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పదకొండు మంది మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఓ ట్రక్కు వ్యాన్ పైకి దూసుకెళ్లింది. ఈ సంఘటన శనివారం అర్ధరాత్రి జరిగింది.
చంద్రాపూర్ జిల్లా కొర్పన ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యాన్, ట్రక్ ఢీ కొనడంతో వ్యాను డ్రైవర్ సహా పదకొండు మంది మృతి చెందారు. మృతి చెందిన వారిలో ఏడుగురు మహిళలు, మూడేళ్ల చిన్నారి ఉన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటన పైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పదిహేను మంది ప్రయాణికులతో కూడిన వ్యాన్ను కొర్పన నుంచి వనీ రోడ్డు వైపుగా వస్తున్న ట్రక్కు వేగంగా వచ్చి ఢీకొందని చెబున్నారు.