నోట్లో గుడ్డలు కుక్కి, ఒకే యువతిపై రెండుసార్లు గ్యాంగ్ రేప్
పాల్ఘర్: మహారాష్ట్రలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతిపై ఒకే వారంలో రెండు సార్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు నలుగురు కామాంధులు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఇరవై ఏళ్ల బాధిత యువతిపై వారంలో రెండుసార్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారా దుర్మార్గులు. ఆగస్టు 5న ఒకసారి, ఆగస్టు 11న మరోసారి ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.
ఒంటరిగా ఉన్న యువతిని అపహరించిన ఆ నలుగురు కామాంధులు.. పాల్ఘర్లోని లెప్రసీ సెంటర్ సమీపంలోకి లాక్కెళ్లి అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇలా రెండుసార్లు అఘాయిత్యానికి పాల్పడ్డారు.
బాధితురాలు అపస్మారకస్థితికి చేరుకోగానే అక్కడినుంచి పరారయ్యారు. నలుగురు నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఇద్దరిని అబ్దుల్, అర్బాజ్లుగా గుర్తించినట్లు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.