ఎవరు గెలిచినా బొటాబొటి మెజారిటే
Maharashtra Assembly exit Polls 2024: జార్ఖండ్లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 38 నియోజకవర్గాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తొలి దశ పోలింగ్ ఈ నెల 13వ తేదీన ముగిసింది. ఈ నెల 23వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. మహారాష్ట్రతో పాటు ఇక్కడి ఓట్లను లెక్కిస్తారు.
ఈ ఉదయం 7 గంటలకు ఆరంభమైన పోలింగ్ సాయంత్రం 6:30 గంటల వరకు కొనసాగింది. జార్ఖండ్ ముక్తి మోర్చా సారథ్యంలోని ఇండియా, భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటముల మధ్య హోరాహోరీ పోరు సాగింది. ఎవరు గెలుస్తారనేది 23వ తేదీన తేలిపోతుంది. మొత్తం 81 నియోజకవర్గాలు ఉన్న జార్ఖండ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యా బలం 41.

పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడటం మొదలుపెట్టాయి. ఈ కూటమి అధికారంలోకి వస్తుందనే విషయంపై అంచనాలు బహిర్గతమౌతున్నాయి. దాదాపుగా అన్ని ప్రధాన ఎగ్జిట్ పోల్స్- మీడియా సంస్థలు ఉమ్మడిగా సాగించిన ముందస్తు అంచనాలు ఇవి.
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలపై టైమ్స్ నౌ- జేవీసీ తన అంచనాలు విడుదల చేసింది. ఇక్కడ ఇండియా కూటమికి ఓటమి తప్పదని పేర్కొంది. బొటాబొటి మెజారిటీతో బీజేపీ అధికారంలోకి వస్తుందని తెలిపింది. ఈ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూసుకుంటే బీజేపీ కూటమికి 40 నుంచి 44 నియోజకవర్గాలు లభిస్తాయి.
జేఎంఎం- కాంగ్రెస్ కూటమి గట్టిపోటీ ఇస్తుంది గానీ అధికారాన్ని మాత్రం అందుకోబోదు. ఈ కూటమికి 30 నుంచి 40 స్థానాలు లభించే అవకాశం ఉంది. ఇతరులు ఒక్క చోట మాత్రమే తమ ప్రభావాన్ని చూపించగలరని టైమ్స్ నౌ అంచనా వేసింది. దాదాపుగా మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా బీజేపీ కూటమి వైపే మొగ్గు చూపడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
-
బీహార్ సీఎంగా లాలూకు నమ్మినబంటు: నాడు రబ్రీదేవి కేబినెట్ లో మంత్రి -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications