Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భారీ ఎన్‌కౌంటర్.. ఇద్దరు మహిళా నక్సలైట్లతో సహా నలుగురు హతం

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో నక్సల్ వ్యతిరేక ఆపరేషన్లలో భద్రతా దళాలు మరో భారీ విజయాన్ని సాధించాయి. శనివారం సాయంత్రం ప్రారంభమై ఆదివారం మధ్యాహ్నం వరకు కొనసాగిన ఎదురుకాల్పుల్లో నలుగురు నక్సలైట్లు హతమయ్యారు. వీరిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. మరణించిన నక్సలైట్లపై మొత్తం రూ.17 లక్షల బహుమతి ప్రకటించబడిందని అధికారులు వెల్లడించారు.

బసాగుడ, గంగలూర్ సరిహద్దుల్లో ఎదురుకాల్పులు
బీజాపూర్ జిల్లాలోని దక్షిణ-పశ్చిమ ప్రాంతంలో గల బసాగుడ, గంగలూర్ పోలీస్ స్టేషన్ల సరిహద్దు అటవీ ప్రాంతాల్లో మావోయిస్టుల ఉనికి గురించి భద్రతా దళాలకు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ సమాచారం ఆధారంగా డీఆర్జీ(డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్) బీజాపూర్ బృందం జులై 26, 2025 సాయంత్రం గాలింపు చర్యలు చేపట్టింది. ఈ ఆపరేషన్ సమయంలో పోలీసు బలగాలు, మావోయిస్టుల మధ్య తీవ్రమైన ఎదురుకాల్పులు జరిగాయి. ఆదివారం మధ్యాహ్నం వరకు కొనసాగిన ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మరణించారు.

Major Encounter in Chhattisgarh Four Naxalites Including Two Women Killed in Bijaipur

హతమైన మావోయిస్టులు వీరే..

బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ మాట్లాడుతూ మరణించిన మావోయిస్టులు దక్షిణ సబ్ జోనల్ బ్యూరోకు చెందినవారని వెల్లడించారు. వారి వివరాలు, వారిపై ప్రకటించిన బహుమతులు ఇలా ఉన్నాయి. మరణించిన వారిలో ముగ్గురు ఏరియా కమిటీ సభ్యులు,ఒక పార్టీ సభ్యుడు ఉన్నారు, ఇది మావోయిస్టు సంస్థకు పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు.

హుంగా, ACM (ఏరియా కమిటీ సభ్యుడు): ప్లాటూన్ నంబర్ 10, దక్షిణ సబ్ జోనల్ బ్యూరోకు చెందిన ఇతనిపై రూ.5 లక్షల బహుమతి ఉంది.

లక్కే, ACM (ఏరియా కమిటీ సభ్యురాలు): ప్లాటూన్ నంబర్ 30, దక్షిణ సబ్ జోనల్ బ్యూరోకు చెందిన ఈమెపై రూ.5 లక్షల బహుమతి ఉంది.

భీమే, ACM (ఏరియా కమిటీ సభ్యురాలు): దక్షిణ సబ్ జోనల్ బ్యూరోకు చెందిన ఈమెపై ₹5 లక్షల బహుమతి ఉంది.

నిహాల్ అలియాస్ రాహుల్, పార్టీ సభ్యుడు: (సంతోష్, బ్యూరో కమ్యూనికేషన్ టీమ్ హెడ్ గార్డ్) ఇతనిపై రూ.2 లక్షల బహుమతి ఉంది.

ఎన్‌కౌంటర్ స్థలంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం
ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశంలో భద్రతా దళాలు విస్తృతమైన గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ సందర్భంగా భారీ మొత్తంలో ఆయుధాలు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ఒక ఎస్ఎల్ఆర్(సెల్ఫ్-లోడింగ్ రైఫిల్), ఒక INSAS (ఇండియన్ స్మాల్ ఆర్మ్స్ సిస్టమ్) రైఫిల్, ఒక 303 రైఫిల్, ఒక 12 బోర్ గన్, BGL (బ్యారల్ గ్రెనేడ్ లాంచర్), సింగిల్ షాట్ ఆయుధాలు, భారీగా పేలుడు పదార్థాలు, నక్సల్ సంబంధిత ఇతర వస్తువులు ఉన్నాయి. ఈ ఆయుధాల స్వాధీనంతో నక్సలైట్ల కార్యకలాపాలకు మరింత అడ్డుకట్ట పడినట్లయింది.

19 నెలల్లో 425 మంది నక్సలైట్లు హతం
బస్టర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ మాట్లాడుతూ.. భద్రతా దళాలు 2024లో సాధించిన నిర్ణయాత్మక ముందంజను 2025లో కూడా కొనసాగిస్తున్నాయని తెలిపారు. బస్తర్ డివిజన్‌లో నిషేధిత, చట్టవిరుద్ధమైన మావోయిస్టు సంస్థకు వ్యతిరేకంగా ఆపరేషన్లు జరుగుతున్నాయన్నారు. జనవరి 2024 నుంచి జులై 2025 వరకు, మొత్తం 425 మంది మావోయిస్టులు ఎన్ కౌంటర్ లో హతమయ్యారు. ఇది భద్రతా దళాల ప్రభావవంతమైన వ్యూహం, సాహసోపేతమైన చర్యలు, ప్రజల మద్దతుకు స్పష్టమైన నిదర్శనమని ఆయన అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+