ఐ హేట్ బీజేపీ... హేట్ బీజేపీ... హేట్ బీజేపీ... మమతా బెనర్జీ
బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ,బీజేపీ పై మరింత ఆవేశంగా రెచ్చిపోయింది. ఎన్నికల నేపథ్యంలో ఇళ్లు కోల్పోయి నిర్వాసితులైన వారికి మద్దతుగా కోల్కతాలోని నైహతి మున్సిపాలీటి వద్ద ధర్నా చేపట్టింది. ధర్నా నేపథ్యంలోనే ఆమే బీజేపీపై విరుచుకుపడింది. బీజేపీని తాను ఏప్పటికి ద్వేషిస్తానని ఆవేశంగా మాట్లాడింది. బీజేపీపై ప్రతీకారం తీర్చుకునే వరకు తాను వదిలిపెట్టనని హెచ్చరించింది.

ఇక మోడీ బెదిరింపులకు తాను బయపడనని తేల్చిచెప్పింది. తాను చచ్చేవరకు బీజేపీకి వ్యతిరేకంగా పోరాడతానని ప్రకటించింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి కేంద్రంపై ఆధారపడి ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈనేపథ్యంలోనే గత రెండు సంవత్సరాలుగా జరిగిన దాడుల్లో బీజేపీ కార్యకర్తలు చనిపోయారని తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడింది. ఘర్షణల్లో ఒక్కరు కూడ చనిపోలేదని వివరించింది.
ఎన్నికల నేపథ్యంలో కోడ్ను అడ్డం పెట్టుకుని బీజేపీ అరాచాకాలు సృష్టించిందని ఆమే విమర్శించారు. దీంతో బీజేపీని ఐ హెట్ బీజేపీ, ఐ హేట్ బీజేపీ అంటూ గర్ఝించింది. మోడీ తన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర్రపతి పాలన విధించాలని ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించింది. అదే జరగితే మోడీకి తనకంటే పెద్ద శత్రువు ఎవరు ఉండరని హెచ్చరించింది. బీజేపీ చేస్తున్న అరాచాలను తాను ఎప్పటికి మరచి పోనని
వ్యాఖ్యానించింది.












Click it and Unblock the Notifications