పీచమణిచిన దీదీ: థర్డ్ ఫ్రంట్ లీడర్ మమతానే?
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెసు చీఫ్ మమతా బెనర్జీని దెబ్బ తీయడానికి శారద చిట్ ఫండ్స్ కుంభకోణం నుంచి నారద స్టింగ్ ఆపరేషన్ వరకు చాలానే ముందుకు వచ్చాయి. అయితే, అవేవీ మమతా బెనర్జీని దెబ్బ తీయలేకపోయాయి. రెండోసారి ఆమె పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి వచ్చారు.
వామపక్ష కూటమి కాంగ్రెసుతో చేతులు కలిపినా మమతా బెనర్జీని ఏమీ చేయలేకపోయింది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల పోరులో ప్రతిపక్షాలను మమతా బెనర్జీ మరింత మూలకు నెట్టేశారు. ప్రతిపక్షాల కూటమిని అనైతికమైందిగా అభివర్ణించిన మమతా తనది మహా ప్రజా కూటమిగా చెప్పుకున్నారు. అది నిజమని నిరూపించారు.
పశ్చిమ బెంగాల్లో కాంగ్రెసుతో కలిసి పనిచేసిన వామపక్ష కూటమి మరింతగా దిగజారే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో తిరుగులేని నేతగా ఈ ఎన్నికల ఫలితాలతో ముందుకు వచ్చారు. అంతేకాకుండా, 2019 నాటికి జాతీయ స్థాయిలో తృతీయ కూటమి బలపడి దాని నేతగా మమతా బెనర్జీ ముందుకు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు.

రెండో సారి పశ్చిమ బెంగాల్లో విజయం సాధించడమే కాకుండా 42 మంది పార్లమెంటు సభ్యుల బలం ఉండడం వల్ల సహజంగానే తృతీయ కూటమి వామపక్షాలను పక్కన పెట్టి మమతా బెనర్జీ వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయి. నవీన్ పట్నాయక్, నితీష్ కుమార్, అరవింద్ కేజ్రీవాల్ వంటి నేతలతో దీదీ టచ్లో ఉన్నారు.
ముక్కోణపు పోటీలో 34 శాతం మంది ముస్లింలు కూడా మమతా వైపు నిలిచినట్లు అర్థమవుతోంది. పట్టణ ప్రాంత ప్రజలు తృణమూల్ కాంగ్రెసు పట్ల కాస్తా అసంతృప్తిగా ఉన్నా గ్రామీణ ఓటర్ల మద్దతు సంపూర్ణంగా మమతా బెనర్జీకి లభించినట్లు స్పష్టమవుతోంది.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్కు రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది -
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే.. -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!












Click it and Unblock the Notifications